యాప్నగరం

కారుపై విద్యుత్ తీగలు పడి మహిళ సజీవ దహనం

కారుపై హై ఓల్టేజీ విద్యుత్తు తీగలు పడంతో ఓ మహిళ సజీవ దహనమైంది. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లా యాచారంలో చోటు చేసుకుంది.

TNN 13 May 2017, 11:56 am
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారంలో కారుపై హై వోల్టేజ్ విద్యుత్తు తీగలు పడిన ఘటనలో ఓ మహిళ సజీవ దహనమైంది. నిజాంపేటకు చెందిన చంద్రకళ (35), ఆమె భర్త జితెందర్ (45) మరో నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి కారులో తక్కపల్లి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇనుప చువ్వల లోడుతో వస్తున్న లారీ విద్యుత్తు తీగలను తాకడంతో అవి తెగి, కారు ముందు పడ్డాయి.
Samayam Telugu woman burnt alive after car comes in contact with high voltage wire
కారుపై విద్యుత్ తీగలు పడి మహిళ సజీవ దహనం


భయంతో చంద్రకళ కారు నుంచి బయటకు రావడంతో విద్యుదాఘాతానికి గురై కుటుంబీకుల కళ్ల ముందే సజీవ దహనమైంది. కారులో చిక్కుకున్న మిగతా కుటుంబ సభ్యులను స్థానికులు రక్షించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.