యాప్నగరం

హైదరాబాద్‌లో వితంతువుపై గ్యాంగ్‌ రేప్..!

నలుగురు యువకులు ఆటోలో వచ్చి తనని బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు జీడిమెట్ల

TNN 16 Aug 2017, 8:44 am
హైదరాబాద్‌లో ఓ వితంతవుపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త మరణించడంతో కూలి పనులు చేసుకుంటూ గండిమైసమ్మ కూడలిలో మహిళ నివాసం ఉంటోంది. పని కోసం వెళ్లేందుకు గత ఆదివారం షాపూర్‌నగర్ అడ్డాలో వేచి ఉండగా.. నలుగురు యువకులు ఆటోలో వచ్చి తనని బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు జీడిమెట్ల పోలీసులకి తాజాగా బాధితురాలు ఫిర్యాదు చేసింది.
Samayam Telugu woman gang raped in hyderabad
హైదరాబాద్‌లో వితంతువుపై గ్యాంగ్‌ రేప్..!


అత్యాచార విషయం ఎవరికైనా చెప్తే.. చంపేస్తామని నిందితులు తనని బెదిరించారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. నిందితుల్లో రోడామిస్త్రీ‌నగర్‌కి చెందిన అడ్డూ, ఇషాక్‌‌ సదరు మహిళకి పరిచయస్తులని తేలింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జడీమెట్ల పోలీసులు నలుగురి నిందితుల్ని అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే.. భర్త మరణించిన తర్వాత సదరు మహిళ మరొకరితో సహజీవనం చేస్తున్నట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.