యాప్నగరం

రైల్వే ప్లాట్‌ఫాంపైనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

నవమాసాలు నిండిన ఓ గర్భిణి అనుకోని పరిస్థితుల్లో రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

TNN 22 Jun 2017, 9:53 am
నవమాసాలు నిండిన ఓ గర్భిణి అనుకోని పరిస్థితుల్లో రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే రైల్వేస్టేషన్‌లో బుధవారం చోటుచేసుకుంది. 24 ఏళ్ల మీనాక్షి జాదవ్ తన భర్త సందీప్ జాదవ్‌తో కలసి బుధవారం సాయంత్రం థానే రైల్వే స్టేషన్‌కు వచ్చింది. అక్కడి నుంచి లోకల్ ట్రైన్‌లో ఘట్కోపర్ వెళ్లి డాక్టర్‌ను కలవాల్సి ఉంది. 10వ నంబర్ ప్లాట్‌ఫాంపై రైలు కోసం వేచిచూస్తున్న సమయంలో మీనాక్షికి పురుటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఏంచేయాలో తోచని తన భర్త ఏడ్చుకుంటూ అక్కడున్న సహాయం కోరాడు.
Samayam Telugu woman gives birth to baby boy on railway platform
రైల్వే ప్లాట్‌ఫాంపైనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి


వెంటనే స్పందించిన రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారిణి శోభా మోతే.. అక్కడున్న కొంత మంది మహిళల సహాయంతో మీనాక్షికి పురుడు పోశారు. పండంటి మగబిడ్డకు మీనాక్షి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. కాగా, ఆర్ఫీఎఫ్ ఆఫీసర్ శోభా మోతే బిడ్డను ఎత్తుకున్న ఫొటోను సెంట్రల్ రైల్వే తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. దీన్ని రైల్వే మంత్రి సురేష్ ప్రభు రీట్వీట్ చేశారు.
A lady passenger delivered a baby boy at PF10 of Thane stn with timely assistance of RPF LHC Shobha Mote & passenger nurse. @sureshpprabhu pic.twitter.com/870mGMgoxw — Central Railway (@Central_Railway) June 21, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.