యాప్నగరం

భర్త మర్మాంగాలపై మరిగిన నూనె పోసిన భార్య!

తన భర్తకు చెప్పి చెప్పి విసిగిపోయింది. చివరిగా హెచ్చరించినా ఫలితం లేకపోయింది. ఓర్పు నశించడంతో బాగా మరిగిన నూనెను మర్మాంగాలపై పోసి.. బుద్ధి చెప్పింది. ఇంతకీ అతను చేసిన తప్పేంటో తెలుసా? అయితే, చూడండి.

TNN 5 Dec 2017, 5:59 pm
న భర్తకు చెప్పి చెప్పి విసిగిపోయింది. చివరిగా హెచ్చరించినా ఫలితం లేకపోయింది. ఓర్పు నశించడంతో బాగా మరిగిన నూనెను మర్మాంగాలపై పోసి.. బుద్ధి చెప్పింది. ఇంతకీ అతను చేసిన తప్పేంటో తెలుసా? అయితే, చూడండి. చెన్నైకు చెందిన పి.శశికళ (30) భర్త ఎం.పరమేశ్వరం.. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. దీంతో, పరమేశ్వరం కొన్నాళ్లు ఇంటికి రావడం కూడా మానేశాడు. దీనిపై శశికళ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు పరమేశ్వరన్‌ను పిలిచి హెచ్చరించి పంపించారు. అయినా, అతనిలో మార్పు రాలేదు.
Samayam Telugu woman pours hot oil on private parts of her horny husband for having extramarital affair
భర్త మర్మాంగాలపై మరిగిన నూనె పోసిన భార్య!


దీంతో.. ఆమె ‘‘ఇంటికి రండి, ఇకపై మిమ్మల్ని ఏమీ అనను. నాతోనే ఇంట్లో ఉండండి’’ అని పిలిచింది. తన భార్య తన అక్రమ సంబంధాన్ని క్షమించేసిందని, ఇక తనకు తిరుగులేదని భావించిన పరమేశ్వరన్... ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్లాడు. అతను రాత్రి పడక గదిలో నిద్రిస్తున్న సమయంలో... శశికళ బాగా మరిగిన నూనె తెచ్చి మర్మాంగాలపై పోసింది. దీంతో పరమేశ్వరన్ గగ్గోలు పెడుతూ బయటకు పరుగులు తీశాడు. తీవ్రంగా గాయపడ్డ పరమేశ్వరన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.