యాప్నగరం

అదుపుతప్పి పడిపోతే.. క్రేన్ చిదిమేసింది

స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళ అదుపుతప్పి రోడ్డుపై పడిపోతే.. వెనుకనే వస్తున్న హైడ్రాలిక్ క్రేన్ ఆమె మీది నుంచి వెళ్లిపోయింది.

TNN 16 Oct 2017, 5:22 pm
స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళ అదుపుతప్పి రోడ్డుపై పడిపోతే.. వెనుకనే వస్తున్న హైడ్రాలిక్ క్రేన్ ఆమె మీది నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన ముంబైలోని ఖార్‌ఘర్ ఉత్సవ్ చౌక్ వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖార్‌ఘర్‌ సెక్టార్ 20లోని అడ్వాన్స్ గెలాక్సీ హౌసింగ్ సొసైటీలో నివాసముంటున్న 34 ఏళ్ల సుజాత పూరి, నేరుల్‌లోని వీఎల్‌సీసీ బ్యూటీ క్లినిక్‌లో పనిచేస్తున్నారు.
Samayam Telugu woman run over by hydraulic crane in mumbai freak accident caught on cctv
అదుపుతప్పి పడిపోతే.. క్రేన్ చిదిమేసింది


శనివారం విధులు ముగించుకుని హోండా యాక్టివాపై ఇంటికి వస్తుండగా అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో ఆమె వెనకే పెద్ద హైడ్రాలిక్ క్రేన్ వస్తోంది. సుజాతను గమనించని డ్రైవర్ ఆమె పైనుంచి క్రేన్‌ను పోనిచ్చాడు. క్రేన్ చక్రాలు సుజాత తలను ఛిద్రం చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు.

ప్రమాద దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీడియో ఆధారంగా క్రేన్ డ్రైవర్‌ను గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, సుజాత భర్త కేటరర్‌గా పనిచేస్తున్నారని, వీరికి ఇద్దరు పిల్లలున్నారని ఖార్‌ఘర్ పోలీసులు వెల్లడించారు. అయితే ప్రమాద జరిగిన ప్రాంతంలో వేసిన కాంక్రీట్ రోడ్డు ఎడ్జ్ బాగోలేని కారణంగానే సుజాత స్కూటర్ అదుపుతప్పినట్లు తేలింది. క్రేన్, స్కూటర్ మధ్య దూరం కూడా చాలా తక్కువగా ఉండటంతో క్రేన్ డ్రైవర్ ఆమెను గమనించలేకపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.