యాప్నగరం

మైనర్ బాలికకు పెళ్లి.. నిద్రమాత్రలిచ్చి శోభనం గదిలోకి!

ఓ మహిళ తన మేనకోడలిని పెంచుకుంటానని నమ్మించి, మైనర్ బాలిక జీవితాన్ని సర్వ నాశనం చేసిన దారుణమైన సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో చోటుచేసుకుంది.

TNN 10 Dec 2017, 10:58 am
ఓ మహిళ తన మేనకోడలిని పెంచుకుంటానని నమ్మించి, మైనర్ బాలిక జీవితాన్ని సర్వ నాశనం చేసిన దారుణమైన సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో చోటుచేసుకుంది. పెంపకం పేరుతో తన సోదరుడి 13 ఏళ్ల కుమార్తెను తీసుకొచ్చిన ఆ మహిళ 35 ఏళ్ల వ్యక్తితో రహస్యంగా వివాహం జరిపించింది. అంతేకాదు ఆ బాలికకు నిద్రమాత్రలిచ్చి శోభనం గదిలోకి పంపి అమానుషంగా వ్యవహరించింది. తన కుమార్తె ఎలా ఉందోనని తల్లి వెళ్లేవరకు ఈ ఉదంతం వెలుగులోకి రాలేదు. న వివరాల్లోకి వెళ్తే ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన పాతూరి వెంకయ్య, పార్వతి దంపతుల కుమార్తెను సోదరి నాగలక్ష్మి పెంచుకుంటోంది. ఐదో తరగతి చదువుతోన్న ఆ బాలికను గత నవంబరు 25 న కందుకూరు తీసుకెళ్లి, రహస్యంగా మాలకొండ స్వామి గుడిలో 35 ఏళ్ల మనోజ్‌తో వివాహం జరిపించింది.
Samayam Telugu women conducted her adopted daughters marriage secretly
మైనర్ బాలికకు పెళ్లి.. నిద్రమాత్రలిచ్చి శోభనం గదిలోకి!


ఈ విషయం గురించి కన్నవారికి సమాచారం ఇవ్వకుండా పని పూర్తి చేసిన నాగలక్ష్మి నిద్రమాత్రలు ఇచ్చి శోభనం గదిలోకి పంపింది. బాలికకు మెలకువ వచ్చిన తరువాత, భయంగా ఉంది, తలుపులు తెరవమని వేడకున్నా కనికరించలేదు. దీని గురించి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో బాలికను చిత్ర హింసలకు గురిచేశారు. గత నవంబరు 25న వివాహం అయిన దగ్గర నుంచి విషయం ఎవరికీ చెప్పవద్దని రోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తన కుమార్తె ఎలా ఉందని తల్లి వచ్చి చూసేవరకు అసలు విషయం తెలియలేదు. పాప పరిస్థితి చూసి బోరున విలపించిన పార్వతి, తన బిడ్డ గొంతు కోశారని ఆరోపించింది. ఆధార్ కార్డులో వయసు 13 ఏళ్లని ఉంటే, 20 సంవత్సరాలుగా మార్చి ఈ పెళ్లి జరిపించారని ఆమె వ్యాఖ్యానించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.