యాప్నగరం

గురు పౌర్ణమి.. సీఎం కాళ్లు కడిగిన మహిళలు

‘గురు మహోత్సవం (గురు పౌర్ణమి)’ని పురష్కరించుకుని ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇద్దరు మహిళలు పాదాభిషేకం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

TNN 9 Jul 2017, 1:46 pm
‘గురు మహోత్సవం (గురు పౌర్ణమి)’ని పురష్కరించుకుని ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇద్దరు మహిళలు పాదాభిషేకం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఉన్న బ్రహ్మ లోక్ ధామ్‌లో గురు మహోత్సవాన్ని జులై 7న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన వేదిక వద్దకు వచ్చే సమయంలో ఇద్దరు మహిళలు వచ్చి పళ్లెంలో ముఖ్యమంత్రి కాళ్లు పెట్టి నీళ్లు, పూరేకులతో అభిషేకం చేశారు. ఇది సంప్రదాయమో లేక సీఎం కదా అని చేశారో తెలియదు కానీ ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. ప్రముఖ ఏజెన్సీ ఏఎన్ఐ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను ఉంచింది. మీరూ ఓ లుక్కేయండి..
Samayam Telugu women wash feet of jharkhand cm raghubar das on a guru mahotsav
గురు పౌర్ణమి.. సీఎం కాళ్లు కడిగిన మహిళలు

#WATCH: Women wash feet of #Jharkhand CM Raghubar Das on a 'Guru Mahotsav' event held at Jamshedpur's Brahma Lok Dham. (July 7) pic.twitter.com/86wUeIpKzh — ANI (@ANI_news) July 9, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.