యాప్నగరం

షవర్ స్నానం చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మృతి

సందీప్ శర్మ అనే 29 ఏళ్ల యువకుడు బాత్ రూంలో షవర్ ద్వారా స్నానం చేస్తుండగా విద్యుత్ ప్రసారం జరిగింది. దీంతో ఆ యువకుడు విద్యుత్ షాక్‌‌కు గురై బాత్ రూంలోనే...

TNN 11 Dec 2016, 1:31 pm
సందీప్ శర్మ అనే 29 ఏళ్ల యువకుడు బాత్ రూంలో షవర్ ద్వారా స్నానం చేస్తుండగా ఆ షవర్ రాడ్ నుంచి విద్యుత్ ప్రసారం జరిగింది. దీంతో ఆ యువకుడు విద్యుత్ షాక్‌‌కు గురై బాత్ రూంలోనే శవమై పడి ఉన్నాడు.
Samayam Telugu youth dies of electric shock in shower
షవర్ స్నానం చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మృతి


ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరంలో శనివారం జరిగిన ఈ ఘటన సందీప్ శర్మ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. శీతల పానీయాలను ఉత్పత్తి చేసే కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేసే సందీప్ శర్మకు గత నవంబర్ నెలలోనే వివాహం జరిగింది. తల్లిదండ్రులతో పాటు భార్యతో కలిసి లజపత్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. కొత్తగా పెళ్లై ఆనందంగా ఉండాల్సిన సమయంలో అనుకోని విధంగా సందీప్ చనిపోవడంతో ఇరు కుటుంబాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సందీప్ చనిపోయిన విధానాన్ని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి సందీప్ మృతి విద్యుత్ షాక్ ద్వారానే జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచారు. అయితే సందీప్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయటానికి పేరేంట్స్ నిరాకరించారని, ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.