యాప్నగరం

మోదీ @ 3: రైల్వే భద్రతకు రూ.లక్ష కోట్లు!

ప్రశ్నార్థకంగా మారిన రైల్వే భద్రతపై మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.లక్ష కోట్ల భద్రతా నిధిని అందుబాటులోకి తెస్తోంది. ఈ నిధులతో ట్రాకులను ఆధునీకరించడంతోపాటు సిగ్నలింగ్ వ్యవస్థను నవీకరిస్తారు.

TNN 23 May 2017, 11:35 am
ప్రశ్నార్థకంగా మారిన రైల్వే భద్రతపై మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.లక్ష కోట్ల భద్రతా నిధిని అందుబాటులోకి తెస్తోంది. ఈ నిధులతో ట్రాకులను ఆధునీకరించడంతోపాటు సిగ్నలింగ్ వ్యవస్థను నవీకరిస్తారు. కాపలా లేని లెవల్ క్రాసింగ్‌ల వద్ద భద్రతను కల్పించనుంది. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభూ మాట్లాడుతూ.. ‘‘రైల్వే సేఫ్టీ ప్లాన్ కోసం రూ.లక్ష కోట్లు పెట్టుబడి పెడుతున్నాం. రైల్వై ట్రాక్‌ల పగుళ్లను గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నాం. దీనివల్ల రైలు ప్రమాదాలను నియంత్రించవచ్చు’’ అని తెలిపారు.
Samayam Telugu 3 years of modi govt rs one lakh crore for railway safety fund
మోదీ @ 3: రైల్వే భద్రతకు రూ.లక్ష కోట్లు!


‘‘రైల్వేలో ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు, న్యాయబద్ధ ధరల నిమిత్తం.. టారీఫ్‌లు తదితర అంశాల కోసం స్వతంత్ర రైల్వే రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. ప్రయాణికులకు సదుపాయాలను మెరుగుపరిచేందుకు, పెట్టుబడులకు, పారదర్శకత కోసం రైల్ డెవలప్‌మెంట్ అథారిటీ (RDA) ఏర్పాటు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

ప్రయాణికులకు వేగవంత, సౌకర్యవంత ప్రయాణం కోసం హంసఫర్, తేజాస్, అంత్యోదయ ఎక్స్‌ప్రెస్, ఉదయ్ కేటగిరీ రైళ్లు సిద్ధంగా ఉన్నాయని ప్రభు తెలిపారు. తేజాస్ జూన్‌లో ప్రవేశపెడతామని, ఉదయ్ రైళ్లను ప్రవేశపెట్టడానికి ఇంకాస్త సమయం పడుతుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.