యాప్నగరం

హిస్టరీ రిపీట్: నాడు నెహ్రూ... నేడు మోదీ!

2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి.. మూడేళ్లలో రాజకీయంగా మరింత బలోపేతమైంది. ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని చాటడానికి బదులు... క్రమేనా బలహీనం అవుతున్నాయి

TNN 20 May 2017, 6:10 pm
2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి.. మూడేళ్లలో రాజకీయంగా మరింత బలోపేతమైంది. ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని చాటడానికి బదులు... క్రమేనా బలహీనం అవుతున్నాయి. అయితే, మోదీ ప్రభుత్వం ముందు పరిపాలనపరంగా ఇంకా ఎన్నో సమస్యలున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, పేదరికం, అవినీతి నిర్మూళన, సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆగడాలను కట్టడి చేయడం వంటివి ఎన్నో ప్రధాని మోదీకి సవాళ్లు విసురుతున్నాయి.
Samayam Telugu 3 years of modi sarkar bjp may face weak opposition in 2019 elections
హిస్టరీ రిపీట్: నాడు నెహ్రూ... నేడు మోదీ!


బలహీన ప్రతిపక్షం వల్ల మోదీ తిరుగులేని నేతగా ఎదుగుతున్నారు. అప్పట్లో మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ కూడా ఇదే తరహాలో ప్రజాదరణ పొందారు. అప్పట్లో ఆయనకు ప్రతిపక్షం నుంచి గానీ, సొంత పార్టీ నుంచి గానీ వ్యతిరేకులు ఉండేవారు కాదు. దీంతో ఆయన సాఫీగా ప్రభుత్వాన్ని నడిపేశారు. ఈ తరహా వాతావరణం మళ్లీ మోదీ హయాంలో కనిపిస్తోంది. గత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గానీ ఈ తరహా ఫలాలను పొందలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన ప్రధాన మంత్రులకైతే ఆ పదవి ముళ్ల కిరీటాన్ని తలపించేది.

ప్రస్తుత పరిస్థితి మున్ముందు కూడా కొనసాగితే.. మోదీ ప్రభుత్వానికి తిరుగే ఉండదని, 2019లో లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తే ప్రతిపక్షం మరింత బలహీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. కాంగ్రెస్‌తో పాటు యూపీఏ మిత్రపక్షాలు సైతం ఇటీవల ఘోర పరాజయాలను చవిచూసిన నేపథ్యంలో ఇప్పట్లో అవి తేరుకునే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది. ఇది బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉంది.

మోడీ 3 ఏళ్ల పాలన ప్రత్యేక కథనాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.