యాప్నగరం

మోదీ @ 3: ఎన్డీఏ దారి.. ‘రహదారి’

మోదీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో రహదారుల విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గత ప్రభుత్వంతో పోల్చితే ఎన్డీఏ ఆధీనంలో రోడ్ల విస్తరణ పనులు 122 శాతానికి పెరగ్గా, కొత్త రోడ్ల నిర్మాణాలు 25 శాతానికి పెరిగాయి.

TNN 20 May 2017, 6:56 pm
మోదీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో రహదారుల విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గత ప్రభుత్వంతో పోల్చితే ఎన్డీఏ ఆధీనంలో రోడ్ల విస్తరణ పనులు 122 శాతానికి పెరగ్గా, కొత్త రోడ్ల నిర్మాణాలు 25 శాతానికి పెరిగాయి. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. 2011-14 మధ్య రోజుకు 13 కిమీల చొప్పున జాతీయ రహదారులు నిర్మాణమైతే.. మోదీ మూడేళ్ల పాలనలో అది 17 కిమీలకు పెరిగాయి.
Samayam Telugu nda beats upa rolls out roads faster
మోదీ @ 3: ఎన్డీఏ దారి.. ‘రహదారి’


2019 ఎన్నికల నేపథ్యంలో ఈ పనులను మరింత వేగవంతం చేసే పనిలో ఎన్డీయే సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మంత్రి నితిన్ గడ్కారీ రోజుకు 41 కిమీల లక్ష్యంతో పనులు చేపట్టాలని అధికారులకు సూచిస్తున్నారు. గతేడాది కేవలం 17 శాతం పనులు మాత్రమే జరిగిన నేపథ్యంలో ఈ ఏడాది 30 శాతం పనులు పూర్తి కావాలని లక్ష్యంగా నిర్దేశించారు.

రహదారు నిర్మాణంలో యూపీఏ - ఎన్డీఏ మధ్య వ్యత్యాసం ఇది...


మోడీ 3 ఏళ్ల పాలన ప్రత్యేక కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.