యాప్నగరం

నోట్ల రద్దుపై పీఎం క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్

పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే రద్దైన పెద్ద నోట్లపై రాజ్యసభలో వాడీవేడీగా చర్చ ప్రారంభమైంది.

TNN 16 Nov 2016, 12:36 pm
పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే రద్దైన పెద్ద నోట్లపై రాజ్యసభలో వాడీవేడీగా చర్చ ప్రారంభమైంది.
Samayam Telugu congress demands apology from modi over demonetisation
నోట్ల రద్దుపై పీఎం క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్


దివంగత సభ్యులపై సంతాప తీర్మానంతో లోక్‌సభ రేపటికి వాయిదా పడగా...రద్దైన నోట్ల అంశంపై చర్చ చేపట్టాంటూ ప్రతిపక్షాలు రాజ్యసభలో నినాదాలు చేయగా..చైర్మన్ పీజే కురియన్ చర్చకు అనుమతించారు.

చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ మాట్లాడుతూ రూ.500, రూ.1000నోట్లను రద్దు చేసి సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న ప్రధాని మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచిన వారి పేర్లు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వివిధ సంక్షేమ పథకాల్లో కేంద్రం నుంచి లబ్ధిపొందుతున్న లబ్దిదారుల పేర్లు, రుణమాఫీ అర్హుల పేర్లు వెల్లడించిన ఆనంద్ శర్మ ప్రభుత్వాన్ని కోరారు.

ఏలాంటి ఏర్పాట్లు చేసుకోకుండా పెద్ద నోట్లు రద్దు చేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీని వల్ల విదేశీయులు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆనంద్ శర్మ సభ దృష్టికి తీసుకొచ్చారు.

అటు సభ ప్రారంభానికి ముందు నోట్ట రద్దుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడారు. తాము నోట్ల రద్దుకు వ్యతిరేకం కాదని, అయితే రద్దు విధానాన్నే తప్పు బడుతున్నామని ఆమె చెప్పారు.

పెద్ద రద్దుపై తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు...పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.