యాప్నగరం

ఆజాద్ వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం

కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ నోట్ల రద్దుపై చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం రాజ్యసభలో దుమారం రేగింది.

TNN 18 Nov 2016, 11:53 am
కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ నోట్ల రద్దుపై చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం రాజ్యసభలో దుమారం రేగింది. ఉడీ ఘటనలో చనిపోయిన సైనికుల కన్నా నోట్ల రద్దు అనంతరం చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువ అని ఆజాద్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సభలో బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
Samayam Telugu demonetisation azad remarks hit the rs
ఆజాద్ వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం


టెర్రరిస్టుల ఘాతుకాన్ని...సామాన్య ప్రజల చావులతో పోల్చడమేంటనీ సభ్యులు మండిపడ్డారు. ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు పట్టబట్టారు.

ఆజాద్ వ్యాఖ్యలు తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నట్లుగా ఉన్నాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు.

బాధ్యతగల పదవిలో ఉన్న ఆజాద్...జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ అన్నారు.

సభ సజావుగా సాగకపోవడంతో చైర్మన్ సభను కాసేపు వాయిదా వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.