యాప్నగరం

నేను కాదు బీజేపే క్షమాపణ చెప్పాలి: ఆజాద్

నోట్ల రద్దుపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ

Samayam Telugu 18 Nov 2016, 12:42 pm
నోట్ల రద్దుపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పేది లేదని కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలతో ఆడుకుంటున్న బీజేపీ ప్రభుత్వమే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Samayam Telugu demonetisation not congress but bjp should apologise says azad
నేను కాదు బీజేపే క్షమాపణ చెప్పాలి: ఆజాద్


‘దేశాన్ని ఈ పరిస్థితికి దిగజార్చిన బీజేపీ క్షమాపణ చెప్పాలి. నోట్లరద్దుతో సామాన్యుల ఇబ్బందులకు గురికావడానికి బీజేపీ ప్రభుత్వమే కారణం’ అని ఆజాద్ అన్నారు. ఆజాద్ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు.

ఉరీ ఘటనలో చనిపోయిన సైనికుల సంఖ్య కన్నా నోట్ల రద్దు అనంతరం చనిపోయిన సామాన్యుల సంఖ్యే ఎక్కువ ఆజాద్ వ్యాఖ్యానించారు.

ఆజాద్ వ్యాఖ్యలపై పార్లమెంటు ఉభయసభల్లో దుమారం రేగింది. అవినీతిపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడమేగాకుండా....తీవ్రవాదులతో పోరాడి అమరులైన సైనికుల త్యాగాలను కూడా ఆజాద్ కించపరుస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు.

ఆజాద్ బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ సభ్యులు ఉభయ సభల్లో నిరసన వ్యక్తం చేశారు.


అటు నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాలు లోక్‌సభను స్తంభింపజేశాయి. నోట్లరద్దుపై ప్రధానమంత్రి సమాధానం ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేశారు.

సభసజావుగా జరగకపోవడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.