కనీవినీ ఎరుగని రీతిలో కోటానుకోట్ల రూపాయలు ఖర్చు చేసి కూతురు పెళ్లి చేస్తున్న గాలి జనార్ధన్ రెడ్డి వ్యవహారంపై బుధవారం రాజ్యసభలో చర్చ జరిగింది.
ఒకవైపు పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు అల్లాడుతుంటే..రూ.వందల కోట్లు ఖర్చు చేస్తూ కూతురు పెళ్లి చేస్తున్న గాలి జనార్ధన్ రెడ్డికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ సభ్యుడు ఆనందర్ శర్మ రాజ్యసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రూ.500 కోట్లకుపైగా ఖర్చు చేస్తూ అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంటే ప్రధాన మంత్రి నోరుమెదపకపోవడం శోచనీయమని ఆనంద్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు.
గాలి జనార్థన్ రెడ్డికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో విచారణ జరపడంతోపాటు ఆ డబ్బును (పాతనోట్లు) కొత్త నోట్లలోకి ఎలా మార్చారో కనుగొనాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.
అటు రూ.650కోట్లు ఖర్చు చేసి కూతురు పెళ్లి చేస్తున్న గాలి జనార్ధన్ రెడ్డికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో లెక్కలు రాబట్టాలని టి.నర్సింహ్మా మూర్తి అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త కర్ణాటక ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
బుధవారం బెంగళూరులోని పాలేస్ గ్రౌండ్స్ లో గనుల వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి కూతురు బ్రహ్మణి హైదరాబాద్ కు చెందిన రాజీవ్ రెడ్డితో పెళ్లి జరుగుతోంది. ఈ వేడుకకు 50000లకు పైగా అతిథులు (వీఐపీలు, సెలబ్రిటీలతో సహా) వస్తున్నట్లు అంచనా.
ఒకవైపు పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు అల్లాడుతుంటే..రూ.వందల కోట్లు ఖర్చు చేస్తూ కూతురు పెళ్లి చేస్తున్న గాలి జనార్ధన్ రెడ్డికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ సభ్యుడు ఆనందర్ శర్మ రాజ్యసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రూ.500 కోట్లకుపైగా ఖర్చు చేస్తూ అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంటే ప్రధాన మంత్రి నోరుమెదపకపోవడం శోచనీయమని ఆనంద్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు.
గాలి జనార్థన్ రెడ్డికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో విచారణ జరపడంతోపాటు ఆ డబ్బును (పాతనోట్లు) కొత్త నోట్లలోకి ఎలా మార్చారో కనుగొనాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.
అటు రూ.650కోట్లు ఖర్చు చేసి కూతురు పెళ్లి చేస్తున్న గాలి జనార్ధన్ రెడ్డికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో లెక్కలు రాబట్టాలని టి.నర్సింహ్మా మూర్తి అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త కర్ణాటక ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
బుధవారం బెంగళూరులోని పాలేస్ గ్రౌండ్స్ లో గనుల వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి కూతురు బ్రహ్మణి హైదరాబాద్ కు చెందిన రాజీవ్ రెడ్డితో పెళ్లి జరుగుతోంది. ఈ వేడుకకు 50000లకు పైగా అతిథులు (వీఐపీలు, సెలబ్రిటీలతో సహా) వస్తున్నట్లు అంచనా.