యాప్నగరం

సభలో అన్నీ చర్చిద్దాం, సహకరించండి

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వివిధ అంశాలపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని, అందుకు విపక్షాలు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు.

TNN 16 Nov 2016, 11:39 am
నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వివిధ అంశాలపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని, అందుకు విపక్షాలు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు.
Samayam Telugu lets debate national interest modi appeals opposition
సభలో అన్నీ చర్చిద్దాం, సహకరించండి


బుధవారం పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు మోదీ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు.

‘గత పార్లమెంటు సమావేశాల్లో చారిత్రత్మక జీఎస్టీ బిల్లును సభ ఆమోదించింది. అప్పుడు అన్ని పార్టీలకు నేను థాంక్స్ చెప్పాను. ఈ సమావేశాల్లో కూడా ప్రధాన అంశాలపై చర్చిద్దాం. చర్యలు ఫలప్రదంగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని కోరుతున్నా. సభలో చర్చించే అంశాలపై అన్ని పార్టీలతో మాట్లాడతా’ అని మోదీ అన్నారు.

విపక్షాలు డిమాండ్ చేస్తున్న అన్నీ అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మోదీ స్పష్టం చేశారు.

పెద్ద నోట్ల రద్దుపై సభలో చర్చించాలని, మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్న సంగతి తెలిసిందే.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.