యాప్నగరం

నరేంద్ర మోదీ పేదల ‘మెస్సయ్య’: వెంకయ్య

అవినీతి, నల్లధనం అంతమొందించేందుకు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేదల ప్రజలకు

Samayam Telugu 18 Nov 2016, 5:48 pm
అవినీతి, నల్లధనం అంతమొందించేందుకు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేదల ప్రజలకు ‘మెస్సయ్య’ (రక్షకుడు)గా కనిపిస్తున్నారని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.
Samayam Telugu people see modi as messiah says venkaiah
నరేంద్ర మోదీ పేదల ‘మెస్సయ్య’: వెంకయ్య


నోట్లరద్దుపై కాంగ్రెస్ పార్లమెంటులో గందరగోళం సృష్టించి..చర్చలు ఫలవంతంగా సాగనీయకుండా అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు.

నోట్ల రద్దును ఆయన ‘నేషనల్ ప్రాజెక్టు’గా అభివర్ణించారు. దీని ద్వారా ప్రజల భవిష్యత్ అద్భుతంగా ఉండబోతుందని పేర్కొన్నారు.

‘నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని మోదీకి దేశంలో మరింత పాపులారిటీ పెరిగింది. పేదల ప్రజలు ఆయన్ను మెస్సయ్య (రక్షకుడు)గా భావిస్తున్నారు...పార్లమెంటులో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష సభ్యులు ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని వెంకయ్య అన్నారు.

పార్లమెంటులో మోదీ సమాధానం చెప్పాకే నోట్ల రద్దుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నియమించాలని కాంగ్రెస్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. నల్లధనం, అవినీతిని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయా? సమర్థిస్తున్నాయా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.