యాప్నగరం

మూడు రంగుల్లో మెరిసి పోతున్న బూర్జ్ ఖలీఫా

ప్రపంచంలోనే ఎత్తైన భవనం దుబాయ్ లో ఉన్న బూర్జ్ ఖలీఫా.

TNN 25 Jan 2017, 7:36 pm
ప్రపంచంలోనే ఎత్తైన భవనం దుబాయ్ లో ఉన్న బూర్జ్ ఖలీఫా. జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా బూర్జ్ ఖలీఫా మూడు రంగులతో అందంగా ముస్తాబైపోయింది. బూర్జ్ ఖలీఫా వద్ద అక్కడ నివసిస్తున్న భారతీయులు పలు కార్యక్రమాలు చేపట్టారు. భారత పౌరులు త్రివర్ణ పతాకాలతో అక్కడ సందడి చేస్తున్నారు. అక్కడి భారత రాయబార కార్యాలయంతో పాటూ ఇండియన్ హై స్కూల్ లో భారత రాయబార కార్యాలయ అధికారి అనురాగ్ భూషన్ గురువారం పతాకాన్ని ఎగురవేయనున్నారు. కాగా గురువారం భారత్ లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ప్రత్యేక అతిధిగా అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించింది భారత ప్రభుత్వం. గతేడాది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ గణతంత్ర వేడుకలకు అతిధిగా పాల్గొన్నారు.
Samayam Telugu burj khalifa to illuminate in indian national flag colours
మూడు రంగుల్లో మెరిసి పోతున్న బూర్జ్ ఖలీఫా


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.