యాప్నగరం

పట్నాయక్ రిపబ్లిక్ డే సైకత శిల్పం

ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం ద్వారా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

TNN 26 Jan 2017, 2:55 pm
ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం ద్వారా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన ఒక సైతక శిల్పాన్ని నిర్మించారు. త్రివర్ణ పతాకంతో కూడిన హృదయాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నట్టు నిర్మించిన ఈ సైకత శిల్పంపై ‘ఐ లవ్ మై ఇండియా’.. ‘హ్యాపీ రిపబ్లిక్ డే’ అని సందేశం రాసారు.
Samayam Telugu odishas sand artist sudarsan pattnaik creates sculpture to mark 68th republic day
పట్నాయక్ రిపబ్లిక్ డే సైకత శిల్పం


కాగా, భారత్ ఈరోజు 68వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. న్యూఢిల్లీలో జరిగిన గణతంత్ర దిననోత్సవ వేడుకలకు అబుదాబి రాజు మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌పథ్‌లో త్రివిధ దళాలు చేసిన పరేడ్ ఆకట్టుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.