రాజ్పథ్లో త్రివిధ దళాల రాజసం!
దేశ భక్తి ముందు.. వర్షం కూడా తలవంచక తప్పలేదు. 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించిన పెరేడ్లో భారత సైనికుల కవాతు, వైమానిక విన్యాసాలు, శకటాలు, సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.
TNN 26 Jan 2017, 4:58 pm
న్యూఢిల్లీ: దేశభక్తి ముందు.. వర్షం కూడా తలవంచక తప్పలేదు. 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించిన పెరేడ్లో భారత సైనికుల కవాతు, వైమానిక విన్యాసాలు, శకటాలు, సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాల అధిపతులు తదితరులు హాజరయ్యారు. యూఏఈ యువరాజు మహమ్మద్ బిన్ జాయెద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ పెరేడ్లో భారత త్రివిధ దళాలతోపాటు 179 మంది యూఏఈ సైనికుల బృందం కూడా పాల్గొంది.
మిలటరీ పోలీసులు ప్రదర్శించిన డేర్ డెవిల్ స్టంట్... ఒళ్లుగుర్పాటు కల్పించింది. బైకులపై వేగంగా దూసుకెళ్తూ వీరు ప్రదర్శించిన సాహసం ఆశ్చర్యపరిచింది. పెరేడ్లో ఎన్సీసీ, విద్యార్థులు ప్రదర్శించిన వివిధ శాఖలు, రాష్ట్రాల శకటాలు, సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. అయితే, శకటాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శకటాలు మాత్రం కానరాలేదు.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) తొలిసారిగా రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొన్నారు. బ్లాక్ క్యాట్ కమండోస్గా పేరొందిన వీరు.. ఆధునాతన ఆయుధాలతో పెరేడ్లో కనిపించారు. పెరేడ్లో భారత వాయుదళం ప్రదర్శించిన వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. Mi-17 V5 హెలికాప్టర్లు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ పూల వర్షం కురిపించడంతో పెరేడ్ మొదలైంది. రుద్రా, ధృవ్ హెలికాప్టర్లతోపాటు.. Mi-35 యుద్ధ హెలికాప్టర్లు, C-130J, C-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, ఫైటర్ జెట్లు సుఖోయ్, జాగ్వరా, MiG 29... తదితర యుద్ధ విమానాలు ఫార్మేషన్లతో ఆకట్టుకున్నాయి. తెలికపాటి యుద్ధ విమానం (LCA) తేజస్ దాదాపు 300 మీటర్ల ఎత్తులో దూసుకెళ్లడం గమనార్హం. వీటితోపాటు DRDO రూపొందించిన ‘నేత్ర’తోపాటు C-130J ఎయిర్ క్రాఫ్ట్లు, Su-30 MKI, C-17 గ్లోబ్మస్టర్ తదితర యుద్ధ విమానాల ‘ఫ్లై ఫాస్ట్’ ప్రదర్శనలతో పెరేడ్ ముగిసింది.
ఈ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాల అధిపతులు తదితరులు హాజరయ్యారు. యూఏఈ యువరాజు మహమ్మద్ బిన్ జాయెద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ పెరేడ్లో భారత త్రివిధ దళాలతోపాటు 179 మంది యూఏఈ సైనికుల బృందం కూడా పాల్గొంది.
మిలటరీ పోలీసులు ప్రదర్శించిన డేర్ డెవిల్ స్టంట్... ఒళ్లుగుర్పాటు కల్పించింది. బైకులపై వేగంగా దూసుకెళ్తూ వీరు ప్రదర్శించిన సాహసం ఆశ్చర్యపరిచింది. పెరేడ్లో ఎన్సీసీ, విద్యార్థులు ప్రదర్శించిన వివిధ శాఖలు, రాష్ట్రాల శకటాలు, సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. అయితే, శకటాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శకటాలు మాత్రం కానరాలేదు.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) తొలిసారిగా రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొన్నారు. బ్లాక్ క్యాట్ కమండోస్గా పేరొందిన వీరు.. ఆధునాతన ఆయుధాలతో పెరేడ్లో కనిపించారు. పెరేడ్లో భారత వాయుదళం ప్రదర్శించిన వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. Mi-17 V5 హెలికాప్టర్లు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ పూల వర్షం కురిపించడంతో పెరేడ్ మొదలైంది. రుద్రా, ధృవ్ హెలికాప్టర్లతోపాటు.. Mi-35 యుద్ధ హెలికాప్టర్లు, C-130J, C-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, ఫైటర్ జెట్లు సుఖోయ్, జాగ్వరా, MiG 29... తదితర యుద్ధ విమానాలు ఫార్మేషన్లతో ఆకట్టుకున్నాయి. తెలికపాటి యుద్ధ విమానం (LCA) తేజస్ దాదాపు 300 మీటర్ల ఎత్తులో దూసుకెళ్లడం గమనార్హం. వీటితోపాటు DRDO రూపొందించిన ‘నేత్ర’తోపాటు C-130J ఎయిర్ క్రాఫ్ట్లు, Su-30 MKI, C-17 గ్లోబ్మస్టర్ తదితర యుద్ధ విమానాల ‘ఫ్లై ఫాస్ట్’ ప్రదర్శనలతో పెరేడ్ ముగిసింది.