యాప్నగరం

రిపబ్లిక్ డే: ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం

హెలికాప్టర్లు, చార్టెడ్ విమానాలు, డ్రోన్‌లతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశముందన్న నిఘా వర్గాలు.

TNN 25 Jan 2017, 5:25 pm
గణతంత్ర దినోత్సవం నాడు వాయు మార్గం ద్వారా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు భద్రత కట్టుదిట్టం చేసారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించనున్న చారిత్రాత్మిక రాజ్‌పథ్ వద్ద భద్రతను మరింత పెంచారు. ఢిల్లీలో సుమారు 50 వేల మంది ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించారు.
Samayam Telugu tight vigil in delhi on r day anti drone tech to thwart any air attack
రిపబ్లిక్ డే: ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం


లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీపై హెలికాప్టర్లు, చార్టర్ ఫ్లైట్స్, డ్రోన్‌లు ఉపయోగించే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. గాలిలో ఏదైనా అనుమానాస్పదంగా ఎగిరినట్లు తెలిస్తే దాన్ని అంతం చేయడానికి యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లు ధరించిన భద్రతా సిబ్బంది ఎత్తైన భవనాల పై నుంచి కాపలా కాస్తారని చెప్పారు.

సీసీటీవీ కెమెరాలను ఎప్పటికప్పుడ పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసారు. మరోవైపు జనవరి 26న ఉదయం 10.35 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమానాలకు అనుమతి లేదని భద్రతా బలగాలు వెల్లడించాయి.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.