యాప్నగరం

కామన్వెల్త్: రెజ్లింగ్‌లో ఆశలన్నీ సాక్షిమాలిక్‌పైనే..!

2014లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి అంతర్జాతీయ పతకం గెలుపొందిన సాక్షి.. ఆ తర్వాత ఏడాది జరిగిన ఆసియా

TNN 23 Mar 2018, 6:42 pm
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ఏప్రిల్ 4 నుంచి కామన్వెల్త్ క్రీడలు ప్రారంభంకానున్నాయి. భారత్ నుంచి ఈ మెగా ఈవెంట్ కోసం దాదాపు 222 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. రెండేళ్లక్రితం జరిగిన రియో ఒలింపిక్స్‌లో భారత్‌కి తొలి పతకం అందించిన రెజ్లర్‌ సాక్షిమాలిక్‌పై ఈసారి దేశం గంపెడాశలు పెట్టుకుంది. నాలుగేళ్లక్రితం జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన సాక్షి.. ఈసారి స్వర్ణంపై కన్నేసింది.
Samayam Telugu ...



2014లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి అంతర్జాతీయ పతకం గెలుపొందిన సాక్షి.. ఆ తర్వాత ఏడాది జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి అంచనాల్ని అందుకుంది. 2016, ఆగస్టులో జరిగిన రియో ఒలింపిక్స్‌లో దాదాపు ముప్పావు శాతం క్రీడలు ముగిసినా.. ఖాతా తెరవలేక ఢీలాపడిన భారత్‌కి రెజ్లింగ్‌ ద్వారా తొలి పతకాన్ని అందించి భారతీయుల్ని గర్వపడేలా చేసింది. మరోసారి ఈ హరియాణ రెజ్లర్ నుంచి ఆ స్థాయి ప్రదర్శనని దేశం ఆశిస్తోంది. ఏప్రిల్ 14న ఉదయం 6 గంటలకి 62కేజీల విభాగంలో సాక్షిమాలిక్ పోటీపడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.