కామన్వెల్త్ గేమ్స్లో భారత్కి మరో పతకం ఖాయమైంది. శుక్రవారం పారా టేబుల్ టెన్నిస్లో పోటీపడిన భవీనా 11-6, 11-6, 11-6 తేడాతో ఇంగ్లాండ్కి చెందిన సు బెయిలీని ఓడించి ఫైనల్కి చేరింది. దాంతో.. భారత్ ఖాతాలో మరో మెడల్ చేరడం కూడా ఖాయమైంది. బర్మింగ్హామ్ వేదికగా 8 రోజుల నుంచి జరుగుతున్న ఈ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇప్పటికే వెయిట్లిప్టింగ్, బాక్సింగ్, లాన్ బౌల్స్ తదితర ఈవెంట్లలో భారత్కి పతకాలు దక్కాయి. ఈ క్రమంలో ఇప్పటికే 20 మెడల్స్ని ఖాతాలో వేసుకున్న భారత్.. పతకాల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఆరు బంగారు పతకాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి.
ఓవరాల్గా పతకాల పట్టికలో ఆస్ట్రేలియా 132 మెడల్స్తో టాప్లో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఇంగ్లాండ్ (118), కెనడా (59), న్యూజిలాండ్ (37), స్కాట్లాండ్ (34) టాప్-5లో కొనసాగుతున్నాయి.
ఓవరాల్గా పతకాల పట్టికలో ఆస్ట్రేలియా 132 మెడల్స్తో టాప్లో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఇంగ్లాండ్ (118), కెనడా (59), న్యూజిలాండ్ (37), స్కాట్లాండ్ (34) టాప్-5లో కొనసాగుతున్నాయి.