కామన్వెల్త్ గేమ్స్ 2022లో శుక్రవారం రాత్రి భారత్కి నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్డ్ మెడల్స్ లభించాయి. ఫురుషుల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో ఈరోజు పోటీపడిన బజరంగ్ పునియా (Bajrang Punia) గోల్డ్ మెడల్ సాధించగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మహిళల రెజ్లింగ్ 62 కేజీల విభాగంలో పోటీపడిన సాక్షి మాలిక్ (Sakshi Malik) కూడా బంగారు పతకాన్ని సాధించింది. దాంతో.. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య కూడా 23కి చేరింది. ఈరోజు ఫైనల్లో కెనడాకి చెందిన లచ్నాల్ మెక్నిల్తో పోటీపడిన బజరంగ్ పునియా.. 9-2 తేడాతో అతడ్ని చిత్తు చేసి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారత్కి ఇది ఏడో గోల్డ్ మెడల్కాగా.. కామన్వెల్త్ గేమ్స్ 2022లో రెజ్లింగ్లో భారత్కి లభించిన మొదటి బంగారు పతకం ఇదే. అలానే కామన్వెల్త్ గేమ్స్లో బజరంగ్ పునియా పతకం గెలవడం ఇది వరుసగా మూడోసారి.
మహిళల ఫ్రీస్టయిల్ 62 కేజీల విభాగంలో పోటీపడిన సాక్షి మాలిక్ కూడా ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. కెనడాకి చెందిన అనా గోంజలెజ్తో పసిడి పతక పోరులో ఢీకొట్టిన సాక్షి మాలిక్ ఒకానొక దశలో 0-4తో వెనకబడింది. కానీ.. ఆ తర్వాత అనూహ్యరీతిలో పుంజుకుని ఎట్టకేలకి కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి బంగారు పతకాన్ని ముద్దాడింది.
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఇప్పటికే 33 పతకాలు గెలిచి.. పతకాల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. ఇందులో 8 బంగారు, 8 రజతాలు, 7 కాంస్య పతకాలు ఉన్నాయి. ఓవరాల్గా ఆస్ట్రేలియా 134 పతకాలతో టాప్లో కొనసాగుతోంది.
మహిళల ఫ్రీస్టయిల్ 62 కేజీల విభాగంలో పోటీపడిన సాక్షి మాలిక్ కూడా ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. కెనడాకి చెందిన అనా గోంజలెజ్తో పసిడి పతక పోరులో ఢీకొట్టిన సాక్షి మాలిక్ ఒకానొక దశలో 0-4తో వెనకబడింది. కానీ.. ఆ తర్వాత అనూహ్యరీతిలో పుంజుకుని ఎట్టకేలకి కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి బంగారు పతకాన్ని ముద్దాడింది.
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఇప్పటికే 33 పతకాలు గెలిచి.. పతకాల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. ఇందులో 8 బంగారు, 8 రజతాలు, 7 కాంస్య పతకాలు ఉన్నాయి. ఓవరాల్గా ఆస్ట్రేలియా 134 పతకాలతో టాప్లో కొనసాగుతోంది.