యాప్నగరం

కామన్వెల్త్‌లో స్వర్ణం గెలిచిన సుశీల్ కుమార్

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో గురువారం భారత రెజ్లర్లు పతకాల వేటలో దూసుకెళ్లారు. పురుషుల 74 కేజీల ఫ్రీ స్టైల్

Samayam Telugu 12 Apr 2018, 3:20 pm
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో గురువారం భారత రెజ్లర్లు పతకాల వేటలో దూసుకెళ్లారు. పురుషుల 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీపడిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పసిడి పతక పోరులో దక్షిణాఫ్రికాకు చెందిన రెజ్లర్ బోథాను కేవలం 80 సెకన్లలోనే మట్టికరిపించిన సుశీల్ కుమార్ భారత స్వర్ణాల సంఖ్యని 14కి పెంచాడు. ఈరోజు పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీపడిన రెజ్లర్ రాహుల్ అవేర్ కూడా పసిడి పతకం గెలుపొందగా.. మహిళల 53 కేజీల ఫ్రీ స్టైల్‌లో పోటీపడిన బబిత కుమారి రజత పతకాన్ని సాధించింది. ఈ పోటీల తర్వాత మహిళల 76 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీపడిన కిరణ్ కాంస్య పతకాన్ని గెలుపొందింది.
Samayam Telugu commonwealth games 2018 sushil kumar wins gold in mens 74kg freestyle
కామన్వెల్త్‌లో స్వర్ణం గెలిచిన సుశీల్ కుమార్


రెజ్లర్లు గురువారం పతకాల పంట పండించడంతో పతకాల పట్టికలో మూడో స్థానాన్ని భారత్ మరింత సుస్థిరం చేసుకుంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 14 స్వర్ణాలు, 6 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 29 పతకాలు ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా (59 బంగారు, 43 రజతాలు, 45 కాంస్యాలు), ఇంగ్లాండ్ (26 బంగారు, 31 రజతాలు, 22 కాంస్యాలు) దేశాలు కొనసాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.