యాప్నగరం

కామన్వెల్త్‌లో షూటర్‌ తేజస్వినికి రజతం..!

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కి మరో రజత పతకం దక్కింది. గేమ్స్‌లో 8వ రోజైన గురువారం 50 మీటర్ల రైఫిల్

Samayam Telugu 12 Apr 2018, 11:58 am
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కి మరో రజత పతకం దక్కింది. గేమ్స్‌లో 8వ రోజైన గురువారం 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో పోటీపడిన షూటర్ తేజస్విని సావంత్ మెరుగైన ప్రదర్శనతో రజత పతకం గెలుపొందింది. 2006 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కి రెండు బంగారు పతకాలు అందించిన తేజస్విని 2010లో కాంస్య పతకం‌తో మెరిసింది. తాజాగా తేజస్విని గెలిచిన రజతంతో 2018 కామన్వెల్త్‌లో భారత్ పతకాల సంఖ్య 25కి చేరింది.
Samayam Telugu 63726425


50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగం ఫైనల్లో 20 మంది పోటీపడగా.. షాట్ సిరీస్‌లో తేజస్విని వరుసగా 102.1, 102.4, 103.3, 102.8, 103.7 ,104.7తో మొత్తం 618.9 స్కోర్ సాధించి రెండో స్థానంలో నిలిచింది. బంగారు పతకం సాధించిన సింగపూర్ షూటర్ 621.0 స్కోర్ చేయగా.. కాంస్యం గెలిచిన స్కాట్లాండ్ షూటర్ 618.1 స్కోర్ చేసింది.

పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్న భారత్ ఖాతాలో.. ప్రస్తుతం 12 స్వర్ణాలు, 5 రజతాలు, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా (58 స్వర్ణాలు), ఇంగ్లాండ్ (26 స్వర్ణాలు) కొనసాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.