కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు స్వర్ణం అందించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెంకట్ రాహుల్కు అభినందనలు తెలిపారు. గోల్డ్ కోస్ట్లో జరుగుతున్న వెయిట్ లిఫ్టింగ్ 85 కేజీల విభాగంలో రాహుల్ స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ స్వర్ణం సాధించడం గర్వకారణమని మంత్రి రవీంద్ర అన్నారు. తెలుగువారి ప్రతిష్టను రాహుల్ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. ఒలింపిక్స్లోనూ పతకాలు సాధించేలా రాహుల్కు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని ఆయన తెలిపారు.
రాహుల్ స్వర్ణం సాధించడంతో ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ తండ్రి మధు అతి సాధారణ రైతు. తన సొంతింటిని కూడా అమ్మి ఇద్దరు కుమారులకు వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ ఇప్పించారు. స్టువర్టుపురం మారుమూల గ్రామం కావడం వల్ల కుమారుల శిక్షణ కోసం మధు తన కుటుంబంతో పాటు బాపట్లలో నివాసం ఉంటున్నారు.
రాహుల్ స్వర్ణం సాధించడంతో ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ తండ్రి మధు అతి సాధారణ రైతు. తన సొంతింటిని కూడా అమ్మి ఇద్దరు కుమారులకు వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ ఇప్పించారు. స్టువర్టుపురం మారుమూల గ్రామం కావడం వల్ల కుమారుల శిక్షణ కోసం మధు తన కుటుంబంతో పాటు బాపట్లలో నివాసం ఉంటున్నారు.