యాప్నగరం

PV Sindhu: కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన తెలుగుతేజం పీవీ సింధు

Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో తెలుగు తేజం పీవీ సింధు సత్తా చాటింది. బ్యాడ్మింటర్ సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది ఫైనల్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెల్లె లీని ఓడించింది. వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టింది. పతకాల పట్టికలో భారత్‌ 4వ స్థానానికి ఎగబాకింది. భారత్‌కు ఇప్పటివరకు 56 పతకాలు రాగా.. వీటిలో 19 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్య పతకాలు ఉన్నాయి.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 8 Aug 2022, 5:20 pm
కామన్వెల్త్ గేమ్స్‌లో (CWG 2022) భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) సత్తా చాటింది. స్వర్ణ పతకం సాధించింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెల్లె లీని ఓడించింది. వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టింది. పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. తొలి గేమ్‌లో 21-15తో నెగ్గిన పీవీ సింధు.. అదే ఊపులో రెండో గేమ్‌ను 21-13తో గెలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. దీంతో భారత షట్లర్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి పసిడిని ముద్దాడింది. అంతకుముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజత పతకం సాధించింది.
Samayam Telugu PV Sindhu gold medal
పీవీ సింధు


ఒలింపిక్‌ పతకాల విజేత పీవీ సింధు.. కామన్వెల్త్ గేమ్స్‌లో ఏ దశలోనూ తడబాటు లేకుండా అద్భుత ప్రదర్శ చేసింది. సెమీస్‌లో సింగ్‌పూర్‌కు చెందిన యో జియా మిన్‌పై 21-19, 21-17 తేడాతో సింధు అద్భుత విజయ సాధించింది. సెమీస్‌లో వీరిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. కీలకమైన సమయంలో ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా సింధు సత్తా చాటింది. రెండో సెట్‌లోనూ ఆధిక్యం మారుతూ వచ్చినా.. ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తలపడింది. 11-9 ఛేంజ్‌ ఓవర్‌ తర్వాత కూడా ప్రత్యర్థి మిన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్‌ పాయింట్‌ను సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌‌కు ఇప్పటివరకు 56 పతకాలు దక్కాయి. వీటిలో 19 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్య పతకాలు ఉన్నాయి. కామన్వెల్త్ క్రీడలు ముగింపు దశకు చేరుకున్నాయి.

కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన పీవీ సింధుకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఏపీ మంత్రి రోజా, పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు.. పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్లు చేశారు.

రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.