ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియా వేదికగా ఏప్రిల్ 4 నుంచి ప్రారంభంకాబోతున్నాయి. 12 రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా సంబరం కోసం ఇప్పటికే భారత్కి చెందిన సగం మంది అథ్లెట్స్ ఆతిథ్య దేశానికి చేరుకోగా.. మరికొంత మంది క్రీడాకారులు త్వరలోనే అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. భారత్ నుంచి 15 క్రీడల్లో దాదాపు 215 మంది క్రీడాకారులు అక్కడికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ జాబితాలో కొంత మంది జిమ్నాస్ట్లు కామన్వెల్త్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది.
కామన్వెల్త్ కోసం గత మూడు నెలల నుంచి జిమ్నాస్ట్లు ప్రాక్టీస్ చేస్తున్నా.. జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ నుంచి వారికి కనీసం కిట్స్ కూడా అందలేదు. కోచ్ నియామకంలోనూ ఫెడరేషన్ అశ్రద్ధ చూపడంతో అథ్లెట్స్ సొంతంగానే ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అథ్లెట్స్ సౌకర్యాల కల్పనలో ఫెడరేషన్ శీతకన్ను వేసినప్పటికీ.. ఇప్పటి వరకు ఒక్క జిమ్నాస్ట్ కూడా గళం విప్పలేదు. కామన్వెల్త్లో పోటీపడే భారత టీమ్లో దీపా కర్మాకర్తో పాటు బెంగాల్కి చెందిన ప్రణతి నాయక్, ప్రణతి దాస్ ఉండగా.. గాయం కారణంగా దీప తాజాగా పోటీల నుంచి తప్పుకుంది.
పురుషుల జిమ్నాస్ట్ విభాగంలో పోటీపడుతున్న అశిష్ కుమార్ తన వ్యక్తిగత కోచ్తో కలిసి ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాడు. ముంబయికి చెందిన రాకేష్ పత్రా తన వ్యక్తిగత కోచ్ సాయంతో ఇంకా ముంబయిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. కీలక కామన్వెల్త్ గేమ్స్ ముందు కనీసం కోచ్ని నియమించాలనే ఆలోచన లేని జిమ్నాస్టిక్ ఫెడరేషన్పై సర్వత్రా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.
అథ్లెట్స్ సౌకర్యాల కల్పనలో ఫెడరేషన్ నిర్లక్ష్యం గురించి దీప కోచ్ బిశ్వేశ్వర నంది మాట్లాడుతూ ‘ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని నేను ఎక్కడా చూడలేదు. ఈ తరహా ధోరణి భారత్లో మాత్రమే సాధ్యం’ అని పెదవి విరిచాడు. ‘జిమ్నాస్ట్లకి శిక్షణ ఇచ్చేందుకు కోచ్ని ఎప్పుడు నియమిస్తారో..? ఫెడరేషన్ చెప్పలేని విధంగా ఉంది పరిస్థితి’ అని మరో సీనియర్ కోచ్ జయప్రకాశ్ అన్నారు.
కామన్వెల్త్ కోసం గత మూడు నెలల నుంచి జిమ్నాస్ట్లు ప్రాక్టీస్ చేస్తున్నా.. జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ నుంచి వారికి కనీసం కిట్స్ కూడా అందలేదు. కోచ్ నియామకంలోనూ ఫెడరేషన్ అశ్రద్ధ చూపడంతో అథ్లెట్స్ సొంతంగానే ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అథ్లెట్స్ సౌకర్యాల కల్పనలో ఫెడరేషన్ శీతకన్ను వేసినప్పటికీ.. ఇప్పటి వరకు ఒక్క జిమ్నాస్ట్ కూడా గళం విప్పలేదు. కామన్వెల్త్లో పోటీపడే భారత టీమ్లో దీపా కర్మాకర్తో పాటు బెంగాల్కి చెందిన ప్రణతి నాయక్, ప్రణతి దాస్ ఉండగా.. గాయం కారణంగా దీప తాజాగా పోటీల నుంచి తప్పుకుంది.
పురుషుల జిమ్నాస్ట్ విభాగంలో పోటీపడుతున్న అశిష్ కుమార్ తన వ్యక్తిగత కోచ్తో కలిసి ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాడు. ముంబయికి చెందిన రాకేష్ పత్రా తన వ్యక్తిగత కోచ్ సాయంతో ఇంకా ముంబయిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. కీలక కామన్వెల్త్ గేమ్స్ ముందు కనీసం కోచ్ని నియమించాలనే ఆలోచన లేని జిమ్నాస్టిక్ ఫెడరేషన్పై సర్వత్రా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.
అథ్లెట్స్ సౌకర్యాల కల్పనలో ఫెడరేషన్ నిర్లక్ష్యం గురించి దీప కోచ్ బిశ్వేశ్వర నంది మాట్లాడుతూ ‘ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని నేను ఎక్కడా చూడలేదు. ఈ తరహా ధోరణి భారత్లో మాత్రమే సాధ్యం’ అని పెదవి విరిచాడు. ‘జిమ్నాస్ట్లకి శిక్షణ ఇచ్చేందుకు కోచ్ని ఎప్పుడు నియమిస్తారో..? ఫెడరేషన్ చెప్పలేని విధంగా ఉంది పరిస్థితి’ అని మరో సీనియర్ కోచ్ జయప్రకాశ్ అన్నారు.