ఛాంపియన్స్ ట్రోఫీలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టును వరుణుడు దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. టోర్నీలో ఇప్పటి వరకు కంగారూలు రెండు మ్యాచ్లు ఆడగా.. వర్షం కారణంగా రెండూ ఫలితం తేలలేదు. తాజాగా బంగ్లాదేశ్తో సోమవారం ముగిసిన మ్యాచ్లో 182 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ 16 ఓవర్లు ముగిసే సమయానికి 83/1తో గెలుపు ముంగిట నిలిచింది. కానీ.. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ని అంపైర్లు నిలిపివేశారు. దాదాపు మూడు గంటలు వేచి చూసినా వరుణుడు కరుణించకపోవడంతో చివరికి చెరొక పాయింట్ ఇచ్చి మ్యాచ్ని రద్దు చేశారు.
టోర్నీలో ఇక ఆస్ట్రేలియాకి మిగిలింది ఒక మ్యాచే. సెమీస్ రేసులో నిలవాలంటే శనివారం ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తప్పక గెలవాలి. అదీ కూడా మెరుగైన రన్రేట్తో విజయం సాధించాలి. ఎందుకంటే రద్దయిన మ్యాచ్ల్లో ప్రత్యర్థితో కలిసి పాయింట్ పంచుకున్నా.. జట్టుకి ఎలాంటి నెట్ రన్రేట్ లభించదు. దీంతో సెమీస్ రేసులో నిలవాలంటే కనీసం చివరి మ్యాచ్లోనైనా వరుణుడు కరుణించాలని ఆసీస్ ప్రార్థించాల్సిందే.
టోర్నీలో ఇక ఆస్ట్రేలియాకి మిగిలింది ఒక మ్యాచే. సెమీస్ రేసులో నిలవాలంటే శనివారం ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తప్పక గెలవాలి. అదీ కూడా మెరుగైన రన్రేట్తో విజయం సాధించాలి. ఎందుకంటే రద్దయిన మ్యాచ్ల్లో ప్రత్యర్థితో కలిసి పాయింట్ పంచుకున్నా.. జట్టుకి ఎలాంటి నెట్ రన్రేట్ లభించదు. దీంతో సెమీస్ రేసులో నిలవాలంటే కనీసం చివరి మ్యాచ్లోనైనా వరుణుడు కరుణించాలని ఆసీస్ ప్రార్థించాల్సిందే.