యాప్నగరం

భారత్‌‌ని ఓడించి టైటిల్‌తో పాకిస్థాన్‌కు రండి

‘ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యంత ఆసక్తికరమైన ఈ మ్యాచ్‌ని కోట్లాది మంది వీక్షిస్తారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా

TNN 3 Jun 2017, 3:43 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ని ఓడించి.. అదే ఉత్సాహంలో టైటిల్‌‌‌ని గెలిచి సగర్వంగా పాకిస్థాన్‌కు తిరిగిరావాలని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ సహర్యార్ ఖాన్ ఆ దేశ క్రికెటర్లకి సూచించారు. టోర్నీలో భాగంగా పాక్‌ తన తొలి మ్యాచ్‌లోనే ఆదివారం టీమిండియాతో ఢీకొంటున్న నేపథ్యంలో జట్టు సభ్యులతో ఛైర్మన్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
Samayam Telugu champions trophy 2017 indvpak
భారత్‌‌ని ఓడించి టైటిల్‌తో పాకిస్థాన్‌కు రండి


‘ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యంత ఆసక్తికరమైన ఈ మ్యాచ్‌ని కోట్లాది మంది వీక్షిస్తారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా క్రమశిక్షణతో ఆడి క్రీడాస్ఫూర్తిని చాటండి. జట్టు ప్రదర్శనపై భారీ అంచనాలున్నాయి. అలా అని ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి మెరుగైన ప్రదర్శనతో భారత్‌ని ఓడించండి. అనంతరం అదే ఉత్సాహంతో టైటిల్‌ గెలిచి విజేతలుగా పాకిస్థాన్‌కి తిరిగిరండి’ అని షహర్యార్ ఖాన్ క్రికెటర్లను ఉద్దేశించి హితబోధ చేసినట్లు పాక్ క్రికెట్ బోర్డు తాజాగా వెల్లడించింది.

‘మా జట్టులో నైపుణ్యమున్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. సర్ఫరాజ్ అహ్మద్ సారథ్యంలో ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తారని నేను ఆశిస్తున్నా. మా అంచనాలకు తగినట్లు వాళ్లు టోర్నీలో రాణించగలిగితే పాకిస్థాన్ టార్గెట్ భారత్‌ని ఓడించడమే కాదు.. టైటిల్‌ని గెలవడం కూడా’ అని మీడియా ముందు షహర్యార్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.