యాప్నగరం

పాతికేళ్ల తర్వాత పాక్‌ క్రికెట్‌ మళ్లీ..?

1992 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కి కొత్త మ్యాచ్ విన్నర్లు వెలుగులోకి వచ్చారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా

TNN 19 Jun 2017, 6:50 pm
పాకిస్థాన్ క్రికెట్‌కి పాతికేళ్ల తర్వాత మళ్లీ మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోందని ఆ దేశ మాజీ కెప్టెన్ అఫ్రిది ఆనందం వ్యక్తం చేశాడు. ఆదివారం ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ని 180 పరుగుల తేడాతో ఓడించి పాకిస్థాన్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జట్టుకి అభినందనలు తెలిపిన అఫ్రిది.. 1992 ప్రపంచకప్ తర్వాత అంతటి విజయాన్ని పాకిస్థాన్ మళ్లీ సాధించిందని కొనియాడాడు.
Samayam Telugu champions trophy win as big as 1992 world cup triumph afridi
పాతికేళ్ల తర్వాత పాక్‌ క్రికెట్‌ మళ్లీ..?


‘1992 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కి కొత్త మ్యాచ్ విన్నర్లు వెలుగులోకి వచ్చారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఫకార్ జమాన్, షదాబ్ ఖాన్, హసన్ అలీ లాంటి యువ ఆటగాళ్లు పాక్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. క్రికెట్ ప్రపంచంపై పాకిస్థాన్ హవా మళ్లీ మొదలవుతోంది. ఇదే అంకిత భావంతో జట్టు ప్రదర్శన కొనసాగితే కచ్చితంగా పాకిస్థాన్ క్రికెట్ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది’ అని అఫ్రిది ధీమా వ్యక్తం చేశాడు.

అప్పటి కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో 1992 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు ఢీకొన్న పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇంజిమామ్, వసీమ్ అక్రమ్, మియాందాద్, రమీజ్ రాజా తదితరులు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.