యాప్నగరం

బెస్ట్ టీమ్‌లో ముగ్గురు భారత్ క్రికెటర్లకి చోటు

బెస్ట్ టీమ్‌లో ముగ్గురు భారత క్రికెటర్లకి చోటు దక్కగా.. పాకిస్థాన్ జట్టు నుంచి నలుగురు, ఇంగ్లాండ్ నుంచి ముగ్గురు, బంగ్లాదేశ్ నుంచి

TNN 19 Jun 2017, 9:59 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న క్రికెటర్లతో ఐసీసీ ఒక బెస్ట్ టీమ్‌ని ప్రకటించింది. జూన్ 1నుంచి 18వరకు ఎనిమిది జట్లు పోటీపడిన ఈ టోర్నీలో పాకిస్థాన్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. బెస్ట్ టీమ్‌లో ముగ్గురు భారత క్రికెటర్లకి చోటు దక్కగా.. పాకిస్థాన్ జట్టు నుంచి నలుగురు, ఇంగ్లాండ్ నుంచి ముగ్గురు, బంగ్లాదేశ్ నుంచి ఒకరికి స్థానం లభించింది.
Samayam Telugu ct17 team of the tournament
బెస్ట్ టీమ్‌లో ముగ్గురు భారత్ క్రికెటర్లకి చోటు


టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన శిఖర్ ధావన్‌ ఓపెనర్‌గా ఎంపికవగా.. అతనికి జోడీగా ఫైనల్లో శతకం బాదిన పాకిస్థాన్ ఓపెనర్ ఫకార్ జమాన్‌ స్థానం దక్కించుకున్నాడు. తర్వాత బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్, నాలుగో స్థానంలో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి, ఐదో స్థానంలో ఇంగ్లాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జో రూట్ నిలిచారు. ఇక ఆల్‌రౌండర్ జాబితాలో ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్‌స్టోక్స్, వికెట్ కీపర్/ కెప్టెన్‌గా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఎంపికయ్యాడు. స్పిన్నర్‌గా జట్టులో ఇంగ్లాండ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒక్కడికే చోటు దక్కింది. పేసర్ల విభాగంలో భారత్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, పాకిస్థాన్ బౌలర్లు జునైద్ ఖాన్, హసన్ అలీ నిలిచారు.


Here it is, the #CT17 team of the tournament! Not a bad line up! 👌 pic.twitter.com/P0PeMzrrXJ — ICC (@ICC) June 19, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.