యాప్నగరం

సఫారీలపై శిఖర్ ధావన్ అర్ధశతకం

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో

TNN 11 Jun 2017, 8:37 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ 61 బంతుల్లో 8x4, 1x6 సాయంతో అర్ధశతకం సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 191 పరుగులకు ఆలౌటవగా.. ఛేదనకి దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ (12) వికెట్ కోల్పోయింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన ధావన్ రెండో వికెట్‌కి ఏకంగా శతకం భాగస్వామ్యం నెలకొల్పాడు.
Samayam Telugu dhawan slams 19th odi fifty
సఫారీలపై శిఖర్ ధావన్ అర్ధశతకం


పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించిన ధావన్.. అనంతరం శ్రీలంకపై శతకం బాది భారత్‌కి భారీ స్కోరు అందించాడు. తాజాగా సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో క్రీజులో కుదురుకునే వరకూ సహనం ఆడిన ధావన్.. క్రమంగా సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ వరుస బౌండరీలు బాదేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.