యాప్నగరం

ధోనీ చెప్పేవన్నీ వినాలా..?: విరాట్ కోహ్లి

క్లిష్ట పరిస్థితుల్లో అతని సలహా మాత్రమే అడుగుతాను. కానీ..

TNN 4 Jun 2017, 10:49 am
ప్రపంచంలోని అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్రసింగ్ ధోనీ ఒకడు.. అంతమాత్రాన అతను చెప్పే ప్రతి సూచనలు పాటించాల్సిన అవసరం తనకు లేదని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.
Samayam Telugu dont agree on everything with ms dhoni
ధోనీ చెప్పేవన్నీ వినాలా..?: విరాట్ కోహ్లి


ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి మాట్లాడుతూ ‘మ్యాచ్ సమయంలో ధోనీ చెప్పే అన్ని సూచనలను కెప్టెన్‌గా నేను అంగీకరించను. క్లిష్ట పరిస్థితుల్లో అతని సలహా మాత్రమే అడుగుతాను. కానీ.. తుది నిర్ణయం నేనే తీసుకుంటాను. సాధారణంగా మా ఇద్దరి ఆలోచన తీరు ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం తక్కువే. ఏది ఏమైనా మా అంతిమ లక్ష్యం జట్టు గెలవడమే’ అని కోహ్లి వివరించాడు.

వార్మప్ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు మెరుగ్గా రాణించడం‌తో కోహ్లికి కొత్త తలనొప్పి వచ్చి పడిందట. ‘పాకిస్థాన్‌తో మ్యాచ్‌కి ముందు ఏ బౌలింగ్ కాంబినేష‌న్‌తో బరిలోకి దిగాలోనని గత ఆరు రోజుల నుంచి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. వార్మప్ మ్యాచ్‌లో పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి లయ అందుకున్నారు. కానీ.. ఒక ఆల్‌రౌండర్, నలుగురు బౌలర్లని మాత్రమే జట్టులోకి తీసుకోగలం. అయితే పిచ్‌ చూసిన తర్వాత తుది జట్టు ఎంపికపై ఓ నిర్ణయానికి వస్తా’ అని కోహ్లి వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.