క్రికెట్ మ్యాచ్ని ప్రత్యక్షంగా వీక్షించేవారితో పాటు.. టీవీల్లో చూసే ప్రేక్షకులకి కూడా కొత్త అనుభూతిని అందించేందుకు ఐసీసీ కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు ఆచరణలోకి తెస్తోంది. తాజాగా జూన్ 1 నుంచి ఆరంభంకానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ మరో రెండు కొత్త టెక్నాలజీలను వాడేందుకు సిద్ధమైంది. మ్యాచ్కి ముందే పిచ్ తీరును అంచనా వేసేందుకు ప్రత్యేక డ్రోన్లు , షాట్ తీరుని తెలుసుకునేందుకు బ్యాట్స్కి సెన్సార్లు ఏర్పాటు చేయాలని ఐసీసీ నిర్ణయించింది.
మ్యాచ్కి ముందే 8 డ్రోన్లు పిచ్ తీరుపై అత్యాధునిక కెమెరాల సాయంతో ఫొటోలు తీసి విశ్లేషకులకి అందిస్తాయి. వాటి సాయంతో కామెంటేటర్లు పిచ్పై పచ్చిక తీరు, స్పందించే గుణం గురించి చక్కగా అంచనా వేయచ్చు. అదే విధంగా బ్యాట్ హ్యాండిల్ వద్ద సెన్సార్లు ఏర్పాటు చేయడం ద్వారా.. బ్యాట్స్మెన్ షాట్ కొట్టే తీరు.. వేగం, స్ట్రోక్ప్లే గురించి కచ్చితనమైన రీతిలో వ్యాఖ్యాతలు వర్ణించే అవకాశం దొరుకుంది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య డర్బన్ వేదికగా 1992లో జరిగిన టెస్టు మ్యాచ్తో థర్డ్ అంపైర్ విధానం అమలులోకి వచ్చి.. క్రికెట్లో కొత్త టెక్నాలజీ అమలుకి తెరతీసింది. అనంతరం చిన్న చిన్న మార్పులు వచ్చినా.. 2008లో వచ్చిన డీఆర్ఎస్ సంప్రదాయ క్రికెట్లో ప్రకంపనలు రేపింది. అంపైర్ నిర్ణయాన్ని ఓ బ్యాట్స్మెన్ ప్రశ్నించే హక్కు రావడమే ఇందుకు కారణం. అయితే తర్వాత స్పైడర్ కామ్, స్టంప్ కెమెరా, ఎల్ఈడీ బెయిల్స్ లాంటి వచ్చి అభిమానులకి కొత్త అనుభూతిని కలిగిస్తున్న విషయం తెలిసిందే.
మ్యాచ్కి ముందే 8 డ్రోన్లు పిచ్ తీరుపై అత్యాధునిక కెమెరాల సాయంతో ఫొటోలు తీసి విశ్లేషకులకి అందిస్తాయి. వాటి సాయంతో కామెంటేటర్లు పిచ్పై పచ్చిక తీరు, స్పందించే గుణం గురించి చక్కగా అంచనా వేయచ్చు. అదే విధంగా బ్యాట్ హ్యాండిల్ వద్ద సెన్సార్లు ఏర్పాటు చేయడం ద్వారా.. బ్యాట్స్మెన్ షాట్ కొట్టే తీరు.. వేగం, స్ట్రోక్ప్లే గురించి కచ్చితనమైన రీతిలో వ్యాఖ్యాతలు వర్ణించే అవకాశం దొరుకుంది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య డర్బన్ వేదికగా 1992లో జరిగిన టెస్టు మ్యాచ్తో థర్డ్ అంపైర్ విధానం అమలులోకి వచ్చి.. క్రికెట్లో కొత్త టెక్నాలజీ అమలుకి తెరతీసింది. అనంతరం చిన్న చిన్న మార్పులు వచ్చినా.. 2008లో వచ్చిన డీఆర్ఎస్ సంప్రదాయ క్రికెట్లో ప్రకంపనలు రేపింది. అంపైర్ నిర్ణయాన్ని ఓ బ్యాట్స్మెన్ ప్రశ్నించే హక్కు రావడమే ఇందుకు కారణం. అయితే తర్వాత స్పైడర్ కామ్, స్టంప్ కెమెరా, ఎల్ఈడీ బెయిల్స్ లాంటి వచ్చి అభిమానులకి కొత్త అనుభూతిని కలిగిస్తున్న విషయం తెలిసిందే.