యాప్నగరం

భారత్‌ ఓటమితో అభిమాని ఆత్మహత్య

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ జట్టు ఓడిపోగానే.. మనస్థాపం చెందిన బిద్యుత్

TNN 19 Jun 2017, 6:12 pm
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమిని జీర్ణించుకోలేక బంగ్లాదేశ్‌లో ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ 180 పరుగుల తేడాతో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఫలితం అనంతరం చిరు వ్యాపారి అన్సిర్ రెహ్మన్ కొడుకు బిద్యుత్ (25) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
Samayam Telugu fan commits suicide post indias debacle against pakistan in final
భారత్‌ ఓటమితో అభిమాని ఆత్మహత్య


‘ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ జట్టు ఓడిపోగానే.. మనస్థాపం చెందిన బిద్యుత్ రైలు కింద పడి ఆదివారం అర్ధ రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు’ అని రైల్వే పోలీసులు వివరించారు. ఈ టోర్నీలోనే తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ని 124 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. ఫైనల్లో అనూహ్యంగా చేతులెత్తేసింది. బంగ్లాదేశ్‌లో ఉంటున్నా.. బిద్యుత్‌కి భారత్ జట్టు అంటే తెగ ఇష్టమని బంధువులు చెప్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.