యాప్నగరం

పాక్‌తో మ్యాచ్.. ముందు రోజు రాత్రి నిద్రలేదు

నాకు ఆ మ్యాచ్ ఇంకా గుర్తుంది. మ్యాచ్‌కి ముందు రోజు రాత్రి నేను అసలు నిద్రపోలేకపోయాను. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే

TNN 3 Jun 2017, 9:40 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల పోరు సమీపిస్తున్న కొద్దీ మ్యాచ్‌పై చర్చ తారాస్థాయికి చేరుతోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలుస్తుందని స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. భారీ అంచనాలున్న ఈ మ్యాచ్‌లో ఒత్తిడికి తట్టుకుని నిలబడే క్రికెటర్లు టీమిండియాలో చాలా మంది ఉన్నారని.. కానీ పాక్ జట్టులో మాత్రం ఆ స్థాయి ఆటగాళ్లు లేరని భజ్జీ వివరించాడు.
Samayam Telugu harbhajan singh says india hold the edge over pakistan
పాక్‌తో మ్యాచ్.. ముందు రోజు రాత్రి నిద్రలేదు


‘గత కొన్నేళ్లుగా ఒత్తిడిని జయించడమెలాగో భారత్ నేర్చుకుంది. కానీ పాకిస్థాన్ ఈ విషయంలో వెనకబడిపోయింది. ఒకప్పుడు వసీం అక్రమ్, వకార్ యూనిస్, సక్లన్ ముస్తాక్, సయ్యద్ అన్వర్, ఇంజిమామ్ ఉల్ హక్, మహ్మద్ యూసఫ్ లాంటి వారు ఉన్నప్పుడు ఆ జట్టు బలంగా ఉండేది. దాయాదుల పోరంటేనే భారీ అంచనాలుంటాయి. దీంతో క్రికెటర్లపై ఒత్తిడి పెరగడం సహజం. దాన్ని తట్టుకుని నిలబడిన జట్టు పైచేయి సాధిస్తుంది’ అని హర్భజన్ వివరించాడు.

2011లో జరిగిన ప్రపంచకప్‌లో భారత్ జట్టు మొహాలి వేదికగా పాకిస్థాన్‌ని ఢీకొట్టింది. ఈ మ్యాచ్ గురించి భజ్జీ మాట్లాడుతూ ‘నాకు ఆ మ్యాచ్ ఇంకా గుర్తుంది. మ్యాచ్‌కి ముందు రోజు రాత్రి నేను అసలు నిద్రపోలేకపోయాను. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే జనాలు ఏమనుకుంటారు. ఏ తీరులో స్పందిస్తారోనని అని ఆలోచిస్తూ ఉండిపోయాను’ అని గుర్తు చేసుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.