యాప్నగరం

ఛేదనలో పాకిస్థాన్ తడబాటు..!

. పాయింట్ దిశగా అజామ్ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తూ ఫీల్డర్ జడేజా

TNN 5 Jun 2017, 12:02 am
ఛాంపియన్స్ ట్రోఫీలో భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్ జట్టు భారత్ బౌలర్ల ధాటికి తడబడుతోంది. వర్షం కారణంగా 41 ఓవర్లకి 289 పరుగులుగా పాక్ లక్ష్యాన్ని అంపైర్లు కుదించగా.. ఆ జట్టు 15 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులతో కొనసాగుతోంది. ఓపెనర్ అజహర్ అలీ (41: 49 బంతుల్లో 5x4), మహ్మద్ హఫీజ్ (2: 7 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.
Samayam Telugu icc champions trophy 2017
ఛేదనలో పాకిస్థాన్ తడబాటు..!


పాక్ స్కోరు 47 వద్ద ఓపెనర్ అహ్మద్ షెహజాద్(12)‌ని పెవిలియన్‌కు పంపి పేసర్ భువనేశ్వర్ కుమార్ భారత్‌‌‌కి బ్రేక్ ఇవ్వగా.. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో బాబర్ అజామ్ (8)ని ఔట్ చేసి ఉమేశ్ యాదవ్ పాక్‌ని ఒత్తిడిలోకి నెట్టాడు. పాయింట్ దిశగా అజామ్ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తూ ఫీల్డర్ జడేజా చేతికి చిక్కాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అప్పటికి కుదించిన 48 ఓవర్లలో 3 వికెట్ నష్టానికి 319 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్ మొదలవగానే వర్షం రావడంతో అంపైర్లు మళ్లీ ఓవర్లని కుదించి లక్ష్యాన్ని సవరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.