యాప్నగరం

పాక్ ఆ సెంటిమెంట్‌ ఫాలో అయ్యిందా..?

పాకిస్థాన్ కూడా తొలి ఓవర్‌లో ఒక పరుగు కూడా చేయలేదు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌ని ఎదుర్కొన్న ఓపెనర్ అజహర్ అలీ బంతిని

TNN 19 Jun 2017, 4:59 pm
దాయాదుల మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ ఒక సెంటిమెంట్‌ని ఫాలో అయ్యి విజయం సాధించిందా..? అవుననే అంటున్నాయి సమీకరణాలు. టోర్నీ గ్రూప్ దశలో భాగంగా జూన్ 4న జరిగిన తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఓవర్‌లో ఒక పరుగు కూడా చేయలేకపోయింది. ఫాస్ట్ బౌలర్ బౌలర్ మహ్మద్ అమీర్ వైవిధ్యమైన బంతులు విసిరినా.. ఓపెనర్ రోహిత్ శర్మ ఆరు బంతులు ఎదుర్కొని ఒక పరుగు కూడా చేయలేదు. కానీ.. చివరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేయగలిగింది. వర్షం కారణంగా మ్యాచ్‌ని 48 ఓవర్లకి కుదించిన విషయం తెలిసిందే. ఛేదనలో పాక్ 33.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది.
Samayam Telugu icc champions trophy 2017 final
పాక్ ఆ సెంటిమెంట్‌ ఫాలో అయ్యిందా..?


తాజాగా ఆదివారం ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కూడా తొలి ఓవర్‌లో ఒక పరుగు కూడా చేయలేదు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌ని ఎదుర్కొన్న ఓపెనర్ అజహర్ అలీ బంతిని ఫీల్డర్ల మధ్యలోకి నెట్టినా.. పరుగు తీసే ఆలోచన ఏమీ అతనికి కనిపించలేదు. దాయాదుల మ్యాచ్‌లో తొలి ఓవర్ మెయిడిన్ అయితే.. జట్టు స్కోరు 300పైచిలుకు చేస్తుందనే సెంటిమెంట్‌ని పాక్ ఫాలో అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి అనుగుణంగా మ్యాచ్‌లో పాకిస్థాన్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో భారత్ 30.3 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది. అంతేమరి ఏ జట్టు అయినా.. సెంటిమెంట్‌ని ఒక్కసారి నమ్మితే ప్రదర్శన కంటే వాటికే ప్రాధాన్యం పెరిగిపోతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.