యాప్నగరం

భారత్-పాక్‌ మ్యాచ్‌‌లోకి మళ్లీ వరుణుడు

జట్టు స్కోరు 136 వద్ద స్పిన్నర్ షదబ్ ఖాన్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి భారీ షాట్ కోసం ప్రయత్నించిన ధావన్ బౌండరీ లైన్ వద్ద

TNN 4 Jun 2017, 6:19 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఆసక్తికరమైన మ్యాచ్‌కి మళ్లీ వరుణుడు అంతరాయం కలిగించాడు. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 33.1 ఓవర్లు ముగిసే సమయానికి 173/1తో నిలిచిన దశలో వర్షం రావడంతో అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. క్రీజులో ఓపెనర్ రోహిత్ శర్మ (77 నాటౌట్: 108 బంతుల్లో 6x4, 1x6), కెప్టెన్ విరాట్ కోహ్లి (24 నాటౌట్: 27 బంతుల్లో 2x4) ఉన్నారు.
Samayam Telugu icc champions trophy 2017 play stopped due to rain
భారత్-పాక్‌ మ్యాచ్‌‌లోకి మళ్లీ వరుణుడు


అంతకముందు ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో వర్షం రావడంతో దాదాపు 40 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన భారత్ జట్టులో రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (68: 65 బంతుల్లో 6x4, 1x6) కూడా అర్ధశతకాలు బాదేశారు. పేసర్, స్పిన్నర్లు అని తేడా లేకుండా ఎదురుదాడికి దిగిన ఈ జోడి ఎడా పెడా బౌండరీలు బాదేసింది.
అయితే జట్టు స్కోరు 136 వద్ద స్పిన్నర్ షదబ్ ఖాన్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి భారీ షాట్ కోసం ప్రయత్నించిన ధావన్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ అజహర్ అలీ చేతికి చిక్కాడు. దీంతో అబేధ్యమైన 136 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి.. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ని నడిపిస్తున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కి 8.4 ఓవర్లలో 37 పరుగుల అజేయ భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.