యాప్నగరం

​ ఒత్తిడి ఏదైనా ఉంటే.. అది భారత్‌ మీదే..!

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో ఒత్తిడి ఏదైనా ఉంటే.. అది భారత్‌పైనే ఉంటుందని బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా

TNN 14 Jun 2017, 8:52 pm
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో ఒత్తిడి ఏదైనా ఉంటే.. అది భారత్‌పైనే ఉంటుందని బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా అభిప్రాయపడ్డాడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ గురువారం మధ్యాహ్నం జరగనుంది. ఈ నేపథ్యంలో మొర్తజా మాట్లాడుతూ ‘భారత్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఆ దేశంలో క్రికెట్ ప్రేమికులు ఎక్కువ. బంగ్లాదేశ్‌లో కూడా ఆ స్థాయిలో క్రికెట్‌ని ఇష్టపడేవారున్నారు. కానీ.. మాతో పోలిస్తే డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోర్నీ ఆడుతున్న టీమిండియాపైనే ఒత్తిడి ఎక్కువ’ అని వివరించాడు.
Samayam Telugu if theres any pressure its on india mortaza
​ ఒత్తిడి ఏదైనా ఉంటే.. అది భారత్‌ మీదే..!


సెమీస్‌లో బంగ్లాదేశ్‌ని తక్కువ అంచనా వేయడం లేదని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించడంపై మొర్తజా స్పందిస్తూ ‘ప్రతి మ్యాచ్‌‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని మా జట్టు ఆశిస్తోంది. ఫలితం గురించి మేము అతిగా ఆలోచించం. గురువారం మ్యాచ్‌ని సెమీ ఫైనల్‌గా తీసుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. అదే సాధారణ మ్యాచ్‌లా భావిస్తే ఆ ఆలోచన ఉండదు. మాదైన రోజు ఏ జట్టుకైనా మేము సవాల్ విసరగలమని నాకు తెలుసు. గత మూడేళ్ల నుంచి బంగ్లాదేశ్ ఆటతీరులో మార్పు వచ్చింది’ అని ధీమా వ్యక్తం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.