ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ దాయాదుల సమరం. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి భారత్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి మళ్లీ పాక్తో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ని మట్టికరిపించింది. 265 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ (123 నాటౌట్: 129 బంతుల్లో 15x4, 1x6) శతకంతో చెలరేగగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (96 నాటౌట్: 78 బంతుల్లో 13x4) అజేయ అర్ధ శతకం బాదేశాడు. దీంతో లక్ష్యాన్ని భారత్ కేవలం 40.1 ఓవర్లలోనే 265/1తో ఛేదించేసింది.
బుధవారం ఇంగ్లాండ్తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి పాకిస్థాన్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో భారత్- పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్లోనే 124 పరుగుల తేడాతో పాక్ను భారత్ ఓడించిన విషయం తెలిసిందే.
అంతకముందు కేదార్ జాదవ్ (2/22), జస్ప్రీత్ బుమ్రా (2/40), భువనేశ్వర్ కుమార్ (2/53) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 264 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో ముష్ఫికర్ రహీమ్ (61: 85 బంతుల్లో 4x4), తమీమ్ ఇక్బాల్ (70: 82 బంతుల్లో 7x4, 1x6) అర్ధ శతకాలతో ఫర్వాలేదనిపించారు.
బుధవారం ఇంగ్లాండ్తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి పాకిస్థాన్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో భారత్- పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్లోనే 124 పరుగుల తేడాతో పాక్ను భారత్ ఓడించిన విషయం తెలిసిందే.
అంతకముందు కేదార్ జాదవ్ (2/22), జస్ప్రీత్ బుమ్రా (2/40), భువనేశ్వర్ కుమార్ (2/53) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 264 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో ముష్ఫికర్ రహీమ్ (61: 85 బంతుల్లో 4x4), తమీమ్ ఇక్బాల్ (70: 82 బంతుల్లో 7x4, 1x6) అర్ధ శతకాలతో ఫర్వాలేదనిపించారు.