యాప్నగరం

పాక్ ప్రదర్శనపై అఫ్రిది ఫైర్..?

చరిత్రలో తొందరగా మరిచిపోవాల్సిన ప్రదర్శనను ఆదివారం పాక్ చేసింది. ఒక పాకిస్థాన్

TNN 5 Jun 2017, 5:23 pm
భారత్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన పాకిస్థాన్‌పై ఆ దేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఫైర్ అయ్యాడు. మ్యాచ్‌లో కనీస పోరాట పటిమను కూడా పాక్ ప్రదర్శించలేకపోయిందని.. మరోవైపు భారత్ మాత్రం టోర్నీలో ఫేవరెట్‌ మాటకి న్యాయం చేసిందని కొనియాడాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 124 పరుగుల తేడాతో భారత్ ఓడించిన విషయం తెలిసిందే.
Samayam Telugu india played like favourites
పాక్ ప్రదర్శనపై అఫ్రిది ఫైర్..?


‘క్రికెట్ ప్రపంచాన్ని అమితంగా ఆకర్షించిన భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అభిమానుల్ని అలరించడంలో విఫలమైంది. చరిత్రలో తొందరగా మరిచిపోవాల్సిన ప్రదర్శనను ఆదివారం పాక్ చేసింది. ఒక పాకిస్థాన్ మద్దతుదారుడికి మ్యాచ్‌ని చూసి చాలా బాధపడ్డాను. మరోసారి దాయాది దేశంపై భారత్ పైచేయి సాధించింది. ఈ ఓటమి నుంచి బయటపడటానికి కొంత సమయం పడుతుంది’ అని అఫ్రిది వివరించాడు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తెలివిగా నిర్ణయం తీసుకున్నాడన్న అఫ్రిది.. గేమ్ ప్లాన్స్‌ని అమలు చేయడంలో అతను విఫలమయ్యాడని విమర్శించాడు. ‘వాతావరణం తరచూ మారుతుండటంతో టాస్ గెలిచిన సర్ఫరాజ్ ఫీల్డింగ్ ఎంచుకుని సరైన నిర్ణయమే తీసుకున్నాడు. ఎందుకంటే వర్షంతో మ్యాచ్‌కి అంతరాయాలు కలుగుతుంటే ఛేదనకి దిగిన జట్టుకే ఫలితం అనుకూలంగా మారుతుంది. కానీ.. దుర‌దృష్ట‌వ‌శాత్తు పాక్ గేమ్ ప్లాన్‌లు అన్నీ విఫలమయ్యాయి. పేసర్ మహ్మద్ అమీర్‌కి తోడుగా మరో పేసర్‌‌ని బరిలోకి దించకుండా ఆరంభ ఓవర్లలోనే స్పిన్నర్‌‌తో బౌలింగ్ చేయిచడం భారత్ ఓపెనర్లకి కలిసొచ్చింది. అమీర్‌ ఓవర్‌లో జాగ్రత్తగా ఆడిన రోహిత్, ధావన్.. స్పిన్నర్‌ని లక్ష్యంగా చేసుకుని పరుగులు రాబట్టారు. దీనికి తోడు పేలవ ఫీల్డింగ్, బౌలర్లకి గాయం జట్టు ప్రదర్శనని దారుణంగా దెబ్బతీసింది’ అని అఫ్రిది వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.