యాప్నగరం

సైలెన్స్ ప్లీజ్.. కోహ్లి నువ్వు ఆట ఆడుకో..!

నువ్వు టీమిండియాకి కెప్టెన్‌వి. అతను జట్టుకి ప్రధాన కోచ్. సమస్య ఏదైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోండి.

TNN 3 Jun 2017, 5:25 pm
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రూమర్లను పట్టించుకోకుండా ఆటపై దృష్టి పెట్టాలని భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. గత కొద్దిరోజుల నుంచి జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లి మధ్య విభేదాలు తలెత్తిన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం‌.. టోర్నీలో జట్టు ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపబోదని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు.
Samayam Telugu just keep quiet and play the game
సైలెన్స్ ప్లీజ్.. కోహ్లి నువ్వు ఆట ఆడుకో..!


‘నువ్వు టీమిండియాకి కెప్టెన్‌వి. అతను జట్టుకి ప్రధాన కోచ్. సమస్య ఏదైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోండి. ప్రస్తుతానికైతే ఈ వివాదాలను కట్టిపెట్టి.. మ్యాచ్‌లు ఆడండి. ఈ రూమర్లు జట్టు ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపవనే నేను అనుకుంటున్నాను. టోర్నీ ముగిసిన తర్వాత రూమర్లపై చర్చిస్తాం’ అని గంగూలీ వివరించాడు. ఇద్దరూ అసాధారణ క్రికెటర్లేనని.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏమి చేయాలో వారికి బాగా తెలుసని ఈ మాజీ కెప్టెన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. మైదానం వెలుపల ఎన్ని గొడవలున్నా.. మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడమే గొప్ప క్రికెటర్ల లక్షణమని పరోక్షంగా కోహ్లిని వెనకేసుకొచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.