యాప్నగరం

వర్షంతో కివీస్-ఆసీస్ మ్యాచ్ రద్దు..!

ఛాంపియన్స్ ట్రోఫీ‌లో వరుణుడి ఆట రెండో రోజే మొదలైపోయింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ మధ్య శుక్రవా

TNN 3 Jun 2017, 12:48 am
ఛాంపియన్స్ ట్రోఫీ‌లో వరుణుడి ఆట రెండో రోజే మొదలైపోయింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ ఆరంభంలోనే వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ని తొలుత 46 ఓవర్లకి కుదించారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (100: 97 బంతుల్లో 9x4, 3x6) శతకం బాదినా చివర్లో వరుసగా వికెట్లు చేజార్చుకుని 45 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది.
Samayam Telugu match abandoned at edgbaston
వర్షంతో కివీస్-ఆసీస్ మ్యాచ్ రద్దు..!


కివీస్ ఇన్నింగ్స్ ముగియగానే మళ్లీ కాసేపు వర్షం రావడంతో అంపైర్లు ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 235 పరుగులుగా నిర్ణయించారు. ఛేదనలో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (18), అరోన్ ఫించ్ (8)తో పాటు హెన్రిక్యూస్ (18) తక్కువ స్కోరుకే ఔటవడంతో ఆస్ట్రేలియా 9 ఓవర్లు ముగిసే సమయానికి 53/3తో నిలిచింది. ఈ దశలో భారీ వర్షం రావడంతో ఆట కొనసాగించే అవకాశం లేనందున మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండు జట్లకి చెరొక పాయింట్‌ను కేటాయించారు. దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య శనివారం టోర్నీ మూడో మ్యాచ్ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.