ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో బ్యాటింగ్ చేసిన తొలి మ్యాచ్లోనే భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (63: 52 బంతుల్లో 7x4, 2x6) అర్ధ శతకంతో మెరిశాడు. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 33.3 ఓవర్లకి 179/3తో నిలిచింది. అప్పటికే యువరాజ్ సింగ్ కూడా ఔటవడంతో ఐదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన ధోనీపై ఒత్తిడి ఉంటుందని అంతా భావించారు. కానీ.. అనూహ్యంగా సిక్స్తో తన పరుగుల ఖాతా తెరిచిన ధోని.. చివరి ఓవర్ వరకూ లంక బౌలర్లని సమర్థంగా ఎదుర్కొంటూ అర్ధశతకం బాదేశాడు.
ఈ మ్యాచ్లో రెండు సిక్స్లు కొట్టిన ధోనీ.. విదేశీ గడ్డపై ఎక్కువ సిక్సర్లు బాదిన భారత క్రికెటర్గా నిలిచాడు. ఇప్పటి వరకు మాజీ కెప్టెన్ గంగూలీ పేరిట ఈ రికార్డు ఉండేది. 296 మ్యాచ్లాడిన గంగూలీ 159 సిక్సర్లు కొట్టగా.. 281 మ్యాచ్ల్లోనే ధోనీ 161 సిక్స్లతో ఆ రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ హిట్టర్ అఫ్రిది 402 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం.
ఈ మ్యాచ్లో రెండు సిక్స్లు కొట్టిన ధోనీ.. విదేశీ గడ్డపై ఎక్కువ సిక్సర్లు బాదిన భారత క్రికెటర్గా నిలిచాడు. ఇప్పటి వరకు మాజీ కెప్టెన్ గంగూలీ పేరిట ఈ రికార్డు ఉండేది. 296 మ్యాచ్లాడిన గంగూలీ 159 సిక్సర్లు కొట్టగా.. 281 మ్యాచ్ల్లోనే ధోనీ 161 సిక్స్లతో ఆ రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ హిట్టర్ అఫ్రిది 402 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం.