క్యాచ్ వదిలేసిన ధోనీ.. నవ్వుకున్న కోహ్లి
వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న ధోనీ.. వేగంగా బంతి దగ్గరకి వెళ్లినా
TNN 31 May 2017, 6:35 pm
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ జట్టుకి వార్మప్ మ్యాచ్ల రూపంలో కావాల్సినంత ప్రాక్టీస్ లభించింది. తాజాగా బంగ్లాదేశ్తో ముగిసిన రెండో వార్మప్ మ్యాచ్లో ఓ ఆసక్తికరమైన ఘటన టీమిండియా క్రికెటర్లతో పాటు మ్యాచ్ చూస్తున్న అభిమానుల్ని నవ్వించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య హిట్టింగ్ చేయడంతో 7 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 23 ఓవర్లలో 83/9తో ఓటమి అంచున నిలిచింది.
Video: #MSDhoni drops a sitter fielding, shares laughs with skipper @imVkohli pic.twitter.com/cAlNWjD9Ss — CricShots Videos (@cricketrending) May 30, 2017
ఈ దశలో బౌలింగ్కి వచ్చిన హార్దిక్ పాండ్య బౌలింగ్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ తస్కిన్ అహ్మద్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ అంచున తాకిన బంతి థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది. దీంతో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న ధోనీ.. వేగంగా బంతి దగ్గరకి వెళ్లినా క్యాచ్ని అందుకోలేకపోయాడు. కీపర్గా వికెట్ల వెనుక ఎన్నో కళ్లుచెదిరే క్యాచ్లను అందుకున్న ధోనీ.. కనీసం బంతిని అందుకునేందుకు సరిగా ప్రయత్నం కూడా చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ.. అది కొద్దిసేపే.. ధోనీ క్యాచ్ అవస్థలు చూసిన కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానంలోనే పడిపడి నవ్వగా ధోనీ కూడా చిరునవ్వు చిందిస్తూ సిగ్గుపడిపోయాడు. చివరికి మరో పరుగు మాత్రమే చేసిన బంగ్లాదేశ్ 84కి ఆలౌటైంది. ఈ మ్యాచ్లో కీపింగ్ బాధ్యతలను దినేశ్ కార్తీక్కి అప్పగించిన ధోని.. బ్యాటింగ్కి రాలేదు.. మ్యాచ్ చివర్లో మాత్రమే కాసేపు ఫీల్డింగ్ చేశాడు.
Video: #MSDhoni drops a sitter fielding, shares laughs with skipper @imVkohli pic.twitter.com/cAlNWjD9Ss — CricShots Videos (@cricketrending) May 30, 2017
ఈ దశలో బౌలింగ్కి వచ్చిన హార్దిక్ పాండ్య బౌలింగ్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ తస్కిన్ అహ్మద్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ అంచున తాకిన బంతి థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది. దీంతో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న ధోనీ.. వేగంగా బంతి దగ్గరకి వెళ్లినా క్యాచ్ని అందుకోలేకపోయాడు. కీపర్గా వికెట్ల వెనుక ఎన్నో కళ్లుచెదిరే క్యాచ్లను అందుకున్న ధోనీ.. కనీసం బంతిని అందుకునేందుకు సరిగా ప్రయత్నం కూడా చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ.. అది కొద్దిసేపే.. ధోనీ క్యాచ్ అవస్థలు చూసిన కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానంలోనే పడిపడి నవ్వగా ధోనీ కూడా చిరునవ్వు చిందిస్తూ సిగ్గుపడిపోయాడు. చివరికి మరో పరుగు మాత్రమే చేసిన బంగ్లాదేశ్ 84కి ఆలౌటైంది. ఈ మ్యాచ్లో కీపింగ్ బాధ్యతలను దినేశ్ కార్తీక్కి అప్పగించిన ధోని.. బ్యాటింగ్కి రాలేదు.. మ్యాచ్ చివర్లో మాత్రమే కాసేపు ఫీల్డింగ్ చేశాడు.