యాప్నగరం

టోర్నీ అలా జరిగితేనే కిక్ : కోహ్లి

సెమీస్ సమీపిస్తున్న కొద్దీ ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా మారుతోంది. గ్రూప్‌-బిలో అన్ని జట్లు రెండు పాయింట్లతో

TNN 10 Jun 2017, 5:03 pm
Samayam Telugu no room for complacency for india
టోర్నీ అలా జరిగితేనే కిక్ : కోహ్లి
ఛాంపియన్స్ ట్రోఫీలో ముప్పావు శాతం మ్యాచ్‌లు పూర్తియినా.. ఇంగ్లాండ్ మినహా ఇప్పటికీ సెమీస్ ఆడే జట్లు ఏవో తేలడం లేదు. ముఖ్యంగా గ్రూప్-బిలోని భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక జట్లు రెండేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. ఒక విజయం, ఒక ఓటమితో అన్నీ సమానంగా నిలిచాయి. దీంతో చివరి రెండు మ్యాచ్‌ల్లోనే సెమీస్ చేరే జట్లు ఎవో తేలనున్నాయి. భారత్ జట్టు దక్షిణాఫ్రికాతో లీగ్ దశ చివరి మ్యాచ్‌లో ఢీకొట్టనుండగా.. పాక్‌తో లంకేయులు అమీతుమీకి సిద్ధమయ్యారు.

‘సెమీస్ సమీపిస్తున్న కొద్దీ ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా మారుతోంది. గ్రూప్‌-బిలో అన్ని జట్లు రెండు పాయింట్లతో నిలిచి టోర్నీని రసవత్తరంగా మార్చేశాయి. నిజానికి ఇలాంటి అమితుమీ మ్యాచ్‌లే అభిమానుల్ని అలరిస్తాయి. దక్షిణాఫ్రికా లాంటి కఠినమైన ప్రత్యర్థిని భారత్ లీగ్ చివరి మ్యాచ్‌లో ఎదుర్కోనుంది. కాబట్టి జట్టులో ఉదాసీనతకి ఆస్కారమే లేదు’ అని కోహ్లి స్పష్టం చేశాడు.

తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ని అలవోకగా ఓడించిన భారత్.. రెండో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 321 పరుగులు చేసినా పేలవ బౌలింగ్ కారణంగా మ్యాచ్‌ని చేజార్చుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.