యాప్నగరం

సెమీస్ చేరిన పాకిస్థాన్‌కి జరిమానా..!

శ్రీలంకతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టులోని ఆటగాళ్లకి 10 శాతం, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కి 20

TNN 13 Jun 2017, 3:25 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో అనూహ్యంగా సెమీస్ చేరిన పాకిస్థాన్‌ జట్టుకి జరిమానా పడింది. శ్రీలంకతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టులోని ఆటగాళ్లకి 10 శాతం, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కి 20 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ నిర్ణయం తీసుకున్నాడు.
Samayam Telugu pakistan fined for slow over rate in cardiff win
సెమీస్ చేరిన పాకిస్థాన్‌కి జరిమానా..!


కేటాయించిన సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే ఒక ఓవర్ తక్కువగా వేయడంతో ఈ మేరకు రిఫరీ జరిమానా విధించారు. ఏడాదిలోపు మరోసారి ఇలానే జరిగితే కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. కార్ఢిప్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.2 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటవగా.. అనంతరం లక్ష్యాన్ని పాకిస్థాన్ 44.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించి సెమీస్ చేరింది.

ఇంగ్లాండ్‌తో బుధవారం తొలి సెమీ ఫైనల్లో పాకిస్థాన్ తలపడనుండగా.. భారత్‌తో బంగ్లాదేశ్‌ రెండో సెమీ ఫైనల్లో గురువారం ఢీకొట్టనుంది. టోర్నీ ఫైనల్ ఆదివారం జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.